అది క్రీ.శ 1895 ప్రాంతం – శ్రీ వనారస సోదరులు రాయచోటి తాలూకా సురభి గ్రామంలో నివాసం ఏర్పరుచుకొని ప్రప్రధమంగా ‘కీచకవధ’ నాటకం ప్రదర్శించారు. ఆ సమయంలో చంద్రగిరి నుండి వలస వచ్చిన శ్రీ సుబ్బదాసు గారు ఈ వనారస సోదరుల తోడ్పాటుతో సురభి గ్రామంలో ‘శ్రీ శారదా మనోవినోదినీ సంగీత నాటక సభ’ స్థాపించారు. అప్పటి నుండి క్రమశిక్షణతో ‘హరిశ్చంద్ర’, ‘శకుంతల’ నాటకాలు తయారుచేసి ఇటు రాయలసీమ. అటు సర్కారు జిల్లాలలో విశేషంగా ప్రదర్శనలిస్తూ నాటక […]పూర్తి వివరాలు ...
గుడికూలును నుయి పూడును వడి నీళ్లం జెఱువు తెగును వనమును ఖిలమౌ చెడనిది పద్యం బొక్కటి కుడియెడమల చూడకన్న గువ్వలచెన్నా! సప్తసంతానాలు కొన్నింటిని పేర్కొని అవన్నీ ఒకనాటికి నశించిపోయేవే కాని చెడనిది పద్యం ఒక్కటే అని చెబుతున్నది గువ్వల చెన్న శతకం. ఇలాంటి ఆణిముత్యాలు మరికొన్ని ఉన్నాయీ శతకంలో. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు ఈ శతకాన్ని అధిక్షేపశతకం క్రింద ప్రచురించారు. శతక రచనా కాలానికి చెందిన సామాజికాంశాలు ఈ శతకంలో చోటు చేసుకొన్నాయి. ‘ఆంధ్రుల సాంఘిక […]పూర్తి వివరాలు ...
– విద్వాన్ కట్టా నరసింహులు బమ్మెరపోతన ఆంధ్రమహాభాగవత రచనకు కొన్నాళ్లముందు చంద్రగ్రహణం నాడు గంగలో స్నానం చేసి ధ్యానం చేస్తున్నాడు. అది మహేశ్వర ధ్యానం. ధ్యానంలో దర్శనమిచ్చినవాడు శ్రీరామభద్రుడు. భాగవతం రచించమన్నాడు. ఆయనకు కలలో కనిపించిన రాముడిలా ఉన్నాడు: మెఱుగు చెంగట నున్న మేఘంబు కైవడి ఉవిద చెంగట నుండ నొప్పువాడు చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిఱునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున బఱగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి […]పూర్తి వివరాలు ...
మైదుకూరు: సమైక్యాంధ్ర ఉద్యమం సెగలు ఒక పక్క రాష్ట్ర రాజకీయాల్లో సెగమంటలు రేపుతుంటే మరో పక్క సాంస్కృతిక స్పృహను రగుల్కొలుపుతోంది. రాయలసీమ ప్రాంతం సాంస్కృతిక వైవిధ్యానికి ఆలవాలమైన ప్రాంతం. ఇక్కడి ప్రజల మాటల్లో నిజాయితీ, నిక్కచ్చితనం ఉట్టిపడుతూ ఉంటుంది.ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు ఖరాఖండీగా చెప్పడం ఈ ప్రాంత ప్రజల మనస్తత్వం. మాటైనా , పాటైనా ఘాటుగా స్పందించడానికి ఏమాత్రం వెనుకాడరు ఈ సీమ పల్లెప్రజలు..! సమైక్యాంధ్ర ఉద్యమం.. సందర్భంగా ప్రజల్లోనుంచి అనేకమంది కళాకారులు ఉద్యమ వేదికలపైకి స్వచ్ఛందంగా […]పూర్తి వివరాలు ...
గుడికూలును నుయి పూడును వడి నీళ్లం జెఱువు తెగును వనమును ఖిలమౌ చెడనిది పద్యం బొక్కటి కుడియెడమల చూడకన్న గువ్వలచెన్నా! వంటి పద్యాలతో గువ్వల చెన్న శతకం శతకసాహిత్యంలో వన్నె కెక్కింది. ఆ నాటి సామాజికాంశాలను ప్రస్ఫుటంగా ప్రకటించి అధిక్షేపశతకాల్లో ఒకటిగా నిలిచింది. ఢిల్లీ, కలకత్తా, బొంబాయి వంటి నగరాల చరిత్రలు వందల వేల సంవత్సరాలవి కాగా మద్రాసు లేదా చెన్నపట్టణం అని పిలువబడుతూ ఉండిన నేటి ‘చెన్నయ్’ నగర చరిత్ర క్రీస్తు శకం పదిహేడో శతాబ్దం […]పూర్తి వివరాలు ...
ఆంధ్ర సాహిత్య ప్రబంధాలలో మనుచరిత్ర కున్నంత స్థానం మరే ప్రబంధానికీ లేదు. అల్లసాని పెద్దనామాత్యుడీ ప్రబంధాన్ని రచించాడు. ఈయన నందవరీక బ్రాహ్మణుడు. చొక్కనామాత్యుని పుత్రుడు. అహోబలం మఠం పాలకుడు శఠగోపయతి వల్ల చతుర్విధ కవిత్వాలు సంపాదించుకొన్నాడు. అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల కొలువులో ప్రవేశించక మునుపే హరికథాసారం రచించాడు. ఈ గ్రంథం లభ్యం కాలేదు. ఇందలి కొన్ని పద్యాలను కస్తూరి రంగకవి తన ఆనందరంగరాట్ఛందంలో ఉదాహరించాడు. శ్రీకృష్ణరాయలు క్రీ.శ. 1509లో విజయనగర సింహాసనం అధిష్ఠించాడు. అప్పటికే ఆ రాజ్యం […]పూర్తి వివరాలు ...
బేట్రాయి సామి దేవుడా-నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా కాటేమి రాయుడా ! కదిరి నరసిమ్మడా మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా 1బే1 శాపకడుపున చేరి పుట్టగా-రాకాసిగాని కోపామునేసి కొట్టగా ఓపినన్ని నీళ్ళలోన వలసీ వేగమె తిరిగి బాపనోళ్ళ సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ 1బే1 తాబేలై తాను పుట్టగ -ఆ నీల్లకాడ దేవాసురులెల్ల గూడగ దోవసూసి కొండకింద దూరగానె సిల్కినపుడు సావులేని మందులెల్ల దేవర్ల కిచ్చినోడ !బే1 అందగాడవవుదు లేవయా-గోపాల గో విందా రచ్చించ రావయా పందిలోన సేరి కోరపంటితో […]పూర్తి వివరాలు ...
సామాజిక నిష్ఠ కలిగియున్న రసం ఏదైనా కావ్యాన్ని చిరస్థాయి స్థితిలో నిల్పుతుంది అనేది అలంకారికుల అభిప్రాయం. విశ్వజనీనమైన, విశ్వసృష్టికి ఆధార భూతమైన, సకల ప్రాణికోటికి సమాన ధర్మమైన శృంగారం ప్రాచీన సాహిత్యంలో ప్రధానమైన స్థానాన్ని పొందబట్టే భోజుడు శృంగార ఏవ ఏకోరసం’’ అన్నాడు. అందుకేనేమో ఒకటవ శతాబ్దిలో శాతవాహన చక్రవర్తి హాలుడు సేకరించిన ప్రాకృత గాథల సమాహారమైన “”గాధాసప్తశతి’’ లో శృంగారమే అధిక పాళ్ళలో కనిపిస్తూంటుంది. ప్రాకృత భాషలో ఉన్న ఈ గాథల్ని “ఛాయ’గా సంస్కృతంలోకి ప్రాచీనులు […]పూర్తి వివరాలు ...
“కాటమరాయుడా..కదిరి నరసిం హుడా” అంటూ పవన్ కల్యాణ్ “అత్తారింటికి దారేదీ” అనే చిత్రం కోసం పాడిన పాట రాయలసీమలో జనులు పాడుకునే ఒక ప్రసిద్ధ జానపదగీతం. కదిరి తాలూకా ఒకప్పుడు కడప జిల్లాలో భాగంగా ఉండేది. అందువల్ల కడప జిల్లా జానపదులకు కూడా ఈ గీతం బాగా పరిచయమే! శ్రీ మహావిష్ణువు దశావతారాలను ఈ గీతం వివరిస్తుంది. ఈ గీతాన్ని చక్క భజన కళాకారులూ ఇతర జానపద కళాకారులూ వివిధ పద్దతుల్లో పాడుకొంటూ ఉంటారు.. 1940 లో […]పూర్తి వివరాలు ...