కడప : జీర్ణాశయ క్యాన్సర్తో బాధపడుతున్న రోగికి అరుదైన శస్త్రచికిత్సను (ఆపరేషను) రిమ్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ అరుదైన శస్త్రచికిత్స వివరాలను రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిధర్ శుక్రవారం మీడియాకు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడప నగరానికి చెందిన బాబు అనే వ్యక్తి సంవత్సరం నుంచి కడుపులో గడ్డతో బాధపడుతూ పది రోజుల క్రితం రిమ్స్ జనరల్ మెడిసిన్ వార్డులో చేరినాడన్నారు. రోగిని పరిశీలించిన మొదటి యూనిట్ వైద్యులు రోగి కడుపులో పెద్ద పేగు […]పూర్తి వివరాలు ...
మురళి వూదే పాపడు కథల సంపుటి ఆవిష్కరణ సామాజిక మార్పును ప్రతిబింబించే దాదా హయాత్ కథలు : సింగమనేని ప్రొద్దుటూరు : సమాజంలో జరుగుతున్న మార్పుకు ప్రతిబింబంగా దాదాహయాత్ కథలు నిలుస్తాయని, గత సమాజపు పరిస్థితులు , నేటి సమాజపు పరిస్థితులను పోల్చి చేసుకునేందుకు ఒక కొలమానంగా నిలుస్తాయన్నారు ప్రముఖ కథా రచయిత, విమర్శకులు సింగమనేని నారాయణ. ఆదివారం ప్రొద్దుటూరు పట్టణంలోని తల్లంసాయి రెసిడెన్సీలో ‘మురళి వూదే పాపడు’ కథల సంపుటిని (దాదా హయాత్ రాసిన కథలు) […]పూర్తి వివరాలు ...
కడపలో పాస్పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు విదేశాంగ మరియు తపాల శాఖల మధ్య అవగాహనా ఒప్పందం జిల్లా వాసులకు తిరుపతి పోయే బాధ తప్పనుంది కడప: ఏప్రిల్ మూడవ తేదీ నుండి కడప జిల్లా వాసులకు స్థానికంగా పాస్పోర్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక మీదట నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో (హెడ్ పోస్టాఫీసు) పాస్పోర్ట్ సేవలు అందిస్తారు. దీంతో జిల్లా వాసులు పాస్పోర్ట్ కోసం తిరుపతి లేదా హైదరాబాదు పోవాల్సిన బాధ తప్పుతుంది. ఏప్రిల్ 3 […]పూర్తి వివరాలు ...
యోగి వేమన విశ్వవిద్యాలయం ఘనత కడప: పరీక్షలు జరిగిన 24 గంటల్లోపే పీజీ ప్రవేశ పరీక్ష (పీజీసెట్ 2016) ఫలితాలను ప్రకటించి యోగి వేమన విశ్వవిద్యాలయ రికార్డు సృష్టించింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్ ఈ ఫలితాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా పీజీసెట్ కన్వీనర్ ఆచార్య రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 1, 2 తేదీల్లో జరిగిన వైవీయూ సెట్కు 2,602 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 2,356 మంది అర్హత […]పూర్తి వివరాలు ...
నాగభూషణరెడ్డి స్వస్థలం ప్రొద్దుటూరు కడప: ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి బి.నాగభూషణ రెడ్డి(B.N.రెడ్డి) నైజీరియా దేశంలో భారత హైకమిషనర్గా నియమితులయ్యారు. నాగభూషణరెడ్డి స్వస్థలం కడప జిల్లా, ప్రొద్దుటూరు. తండ్రి పేరు డాక్టర్ బి. రామసుబ్బారెడ్డి. నాగభూషణ్ 1993 బ్యాచ్ కు చెందినా ఐఎఫ్ఎస్ అధికారి. ప్రస్తుతం నాగభూషణ రెడ్డి జెనీవాలోని “పర్మినెంట్ మిషన్ ఆఫ్ ఇండియా”లో డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా పని చేస్తున్నారు. త్వరలోనే నాగభూషణరెడ్డి బాధ్యతలు స్వీకరిస్తారు. నైజీరియా హైకమిషనర్గా నియమితులైన నాగభూషణరెడ్డి గారికి కడప […]పూర్తి వివరాలు ...
ఆటంకాలు దాటుకొని అలుగుకు శంకుస్థాపన నిర్భందాలు దాటుకుని వేలాదిగా తరలి వచ్చిన జనం అడుగడుగునా అడ్డంకులు కల్పించిన ప్రభుత్వం సిద్దేశ్వరం వెళ్ళే దారిలో వందలాది తనిఖీ కేంద్రాలు రైతునాయకుల అరెస్టుకు పోలీసుల విఫలయత్నం ప్రతిఘటించిన రైతులు (సిద్దేశ్వరం నుండి మా ప్రత్యేక ప్రతినిధి) వాళ్ళు దారి పొడవునా తనిఖీల పేరుతో కాపు కాశారు. కొంతమందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మరికొంతమందిని మార్గమధ్యంలోనే నిలువరించారు. అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. నాలుగు జిల్లాల నుండి తరలివచ్చిన వాహన శ్రేణులను అడ్డుకోవాలని […]పూర్తి వివరాలు ...
నిధుల కొరతతో నీరసిస్తున్నయోగి వేమన విశ్వవిద్యాలయం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం కడప: నగరంలోని యోగి వేమన విశ్వవిద్యాలయంపై నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఫలితంగా విశ్వవిద్యాలయ అభివృద్ది కుంటుపడుతోంది. ఈ నేపధ్యంలో యోగివేమన విశ్వవిద్యాలయానికి సంబంధించి సాక్షి దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం రూ.383 కోట్లు నిధులు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయానికి […]పూర్తి వివరాలు ...
31 రోజులలో 1918 మంది కడప విమానమెక్కినారు మన కడప విమానాశ్రయం నుండి 2015లో 1918 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. 7 జూన్ 2015న ప్రారంభమైన కడప విమానాశ్రయం నుండి ఆ సంవత్సరం ఎయిర్ పెగాసస్ సంస్థ వారానికి మూడు రోజుల పాటు కడప – బెంగుళూరుల నడుమ విమాన సర్వీసును నడిపింది. 2015లో 31 రోజుల పాటు కడప – బెంగుళూరు విమాన సర్వీసు నడిచింది. 2015 సంవత్సరానికి గాను కడప విమానాశ్రయంలో ప్రయాణీకుల […]పూర్తి వివరాలు ...
98.89 శాతం ఉత్తీర్ణత 797 మందికి పదికి పది జిపిఏ కడప: పదోతరగతి ఫలితాల్లో మళ్లీ మనోళ్ళు సత్తా చాటారు. కడప జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపారు. పదోతరగతిలో కడప జిల్లా విద్యార్థులు 98.89 శాతం ఉత్తీర్ణత (Pass) సాధించి జిల్లాను మొదటి స్థానంలో నిలబెట్టారు. మొత్తం 797 మంది విద్యార్థులు (2.2 శాతం) పదికి పది జీపీఏ సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచారు. జిల్లా విద్యాశ్ఖాదికారులు తెలిపిన సమాచారం ప్రకారం 2015-16 విద్యాసంవత్సరానికి గాను జిల్లాలో […]పూర్తి వివరాలు ...