కడప: మూడు రాష్ట్రాల పోలీసు డాగ్ స్క్వాడ్లకు నిర్వహించిన పోటీల్లో కడప డాగ్స్క్వాడ్లు మొదటి, రెండవ బహుమతులు దక్కించుకున్నాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెన్స్ శిక్షణ అకాడమిలో ఈ పోటీలు జరిగినాయి. తెలంగాణ, అరుణాచల్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కుక్కలకు ఈ పోటీలు నిర్వహించారు. కడప జిల్లా కుక్కలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవడంతో బంగారు, రజత పతకం అందచేశారు. ఈ సందర్భంగా డాగ్స్క్వాడ్ భాద్యతలు చూసే రామ్మోహన్రెడ్డి, శ్రీనివాసులు, పీరయ్య, శివకుమార్లను జిల్లా ఎస్పీ […]పూర్తి వివరాలు ...
కడప: ఆదివారం ఉదయం కడప నగరంలోని అమీన్పీర్(పెద్ద) దర్గాను సినిమా కథానాయకుడు నారా రోహిత్ దర్శించి గురువులకు పూలచాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే ఆలోచన తనకు లేదన్నారు.రాష్ట్ర ప్రజలందరికి మేలు జరగాలని పెద్దదర్గాలో ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. నారా రోహిత్ అం.ప్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సోదరుడైన రామ్మూర్తి నాయుడు కుమారుడు. ఈయన బాణం, సోలో, సారోచ్చారు, ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెలో మొదలైన చలనచిత్రాలలో కథానాయకుడిగా నటించారు.పూర్తి వివరాలు ...
ఫిబ్రవరి 22న రెండో విడత 3054 పోలియో బూత్ల ఏర్పాటు కడప: దేశ వ్యాప్తంగా మొదటి విడత పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఈనెల 18వ తేదీన జరుగుతుందని జిల్లా కలెక్టర్ కెవి రమణ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పల్స్పోలియో చుక్కల కార్యక్రమానికి సంబంధించి జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో 3లక్షల 17వేల 452 మంది 0నుంచి 5 సంవత్సరాల పిల్లలకు పల్స్పోలియో చుక్కలు […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: జయహో జనగణమన చతుర్థ వార్షికోత్సవాల సందర్భంగా ప్రొద్దుటూరు అనిబిసెంట్ పురపాలక ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం వివిధ విద్యాసంస్థలకు చెందిన ఆరు వేలమంది విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. 1911 డిసెంబరు 27వ తేదీన రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతాన్ని రచించి ఆలపించిన సందర్భంగా అందరిలో ఐక్యతాభావం, జాతీయతా భావం, దేశభక్తిని పెంపొందించేందుకు, మహనీయులను స్మరించుకునేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సుమారు 6 వేల మంది విద్యార్థులు మైదానానికి చేరుకున్నారు. మాజీమున్సిపల్ […]పూర్తి వివరాలు ...
కడప: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురువారం కడపకు వచ్చాడు. దర్శించుకున్నారు. నగరంలోని అమీన్పీర్ దర్గా (పెద్ద దర్గా)లో జరిగిన ఖ్వాజా సయ్యద్ అమీనుల్లా మహ్మద్ మొహమ్మదుల్ చిష్టిపుల్ ఖాదిరి ఉరుసు ఉత్సవాల్లో చివరిదైన తహలీల్ ఫాతేహా కార్యక్రమంలో రహమాన్ పాల్గొన్నారు. అనంతరం పీఠాధిపతుల ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో చదివింపుల కార్యక్రమం ఉదయం 6 గంటలకు నిర్వహించారు. తహలీల్ ఫాతేహా చదివింపుల కార్యక్రమంతో ఉరుసు ఉత్సవాలు గురువారంతో ముగిశాయి.పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి దేవళంలో బుధవారం ఉదయం అన్నమయ్య సంకీర్తనల టీవీ సినిమా చిత్రీకరణ జరిగింది. ఆలయ రంగమంటపంలో కొలువరో మొక్కురో.. అనే అన్నమయ్య సంకీర్తనను ఆలపించే దృశ్యాన్ని దర్శకుడు ప్రతాప్ చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిపై తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన సంకీర్తనలను దృశ్య రూపంలో చిత్రీకరిస్తున్నామన్నారు. షూటింగ్ పూర్తయ్యాక ఈ టెలీ ఫిలింను శ్రీవారి పాదాల చెంత వుంచి టీటీడీకి అందజేస్తామన్నారు. అంతకుముందు యూనిట్ సభ్యులు స్వామిని […]పూర్తి వివరాలు ...
మలబార్ గోల్డ్, డైమండ్ షోరూం ప్రారంభం ప్రముఖ కథానాయిక కాజల్ అగర్వాల్ ఆదివారం కడపకొచ్చారు. స్థానిక కోటిరెడ్డిసర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్, డైమండ్ షోరూంను సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించారు. షోరూం ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కాజల్ను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. షోరూంను ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన పలు డిజైన్ల ఆభరణాలను కస్టమర్లకు చూపించారు. దాదాపు అరగంట షోరూంలోనే సందడి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాజల్ అగర్వాల్ మలబార్ గోల్డ్, డైమండ్ భారతీయ […]పూర్తి వివరాలు ...
కడప: కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నవంబరు 30లోగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించవలసి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 23-07-2014 తేదీన కేంద్ర ఉక్కు, గనులశాఖమంత్రి తోమార్కు లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన కేంద్రమంత్రి 21-08-2014న ప్రతి లేఖ రాస్తూ, నవంబర్ 30లోగా సెయిల్ తన నివేదికను సమర్పిస్తుందని తెలియచేశారు. ఇవాళ డిసెంబర్ 20. అంటే బిల్లులో పేర్కొన్న ఆరు నెలల గడువు […]పూర్తి వివరాలు ...
ప్రముఖ సాహితీ విమర్శకులు, సాహితీవేత్త ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు ఈ ఏడాది కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రచించిన “మన నవలలు, మన కథలు” అనే విమర్శనా గ్రంథానికి ఈ అవార్డు ఇస్తున్నట్లు శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రకటించింది. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ప్రస్తుతం కడపలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనాకేంద్రం భాద్యులుగా వ్యవహరిస్తూ ఇక్కడి యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో గౌరవ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని కుంట్రపాకం(తిరుపతి సమీప గ్రామం)లో జన్మించిన […]పూర్తి వివరాలు ...