వేమన శతకం ఈ-పుస్తకం రెడ్డి సేవా సమితి కడప మరియు వందేమాతరం ఫౌండేషన్,హైదరాబాద్ ల ప్రచురణ. జూన్ 2011లో ప్రచురితం. పద్యాల సేకరణ : కట్టా నరసింహులు, సంపాదకత్వం: ఆచార్య జి.శివారెడ్డిపూర్తి వివరాలు ...
పుట్టపర్తి నారాయణాచార్యుల వారి మేఘదూతము (పద్యకావ్యం) ఈ-పుస్తక రూపంలో... వర్గీకరణ : కడప జిల్లా సాహిత్యంపూర్తి వివరాలు ...
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి1, 2015న ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో నిర్వహిస్తున్న పోతన భాగవత పద్యార్చనకు వచ్చే 9,10 తరగతులు చదువుతున్న బడి పిల్లోళ్ళు నేర్చుకొని రాయవలసిన పద్యాలు ఇవే అని బమ్మెర పోతన సాహితీ పీఠం సభ్యులు విద్వాన్ కట్టా నరసింహులు తెలియచేశారు. భాగవత పద్యార్చనకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే కింది నెంబర్లలో సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు – +91-9441337542 (విద్వాన్ కట్టా నరసింహులు), +91-9440200358 (కార్యనిర్వహణాధికారి మరియు సహాయ కమీషనర్, ధర్మ ప్రచార మండలి). పై పద్యాలను […]పూర్తి వివరాలు ...
ఋషులదెట్టి జాతి ఇంపుగా వెలసిన బ్రహ్మకిష్టులైరి బ్రహ్మలైరి తుదిని ఎవ్వరైన సొదమునుటేనయా! విశ్వదాభిరామ వినురవేమ ఋషులకు కూడా కులభేదాలు అంటగడితే ఎలా? అంటున్నాడు వేమన ఈ పద్యంలో. ఋషుల కులం, వంశం, తెగ, వర్గం, పుట్టుక లాంటి వాటిని గురించి ఆలోచించడం శుద్ధ అనవసరం.పూర్తి వివరాలు ...
పికము వనములోన విలసిల్ల పలికిన భంగి ప్రాజ్ఞజనుల పలుకు గులుకు కాకి కూత బోలు కర్మబద్ధుల కూత విశ్వదాభిరామ వినురవేమ బుద్ధిమంతుల మాటలు తోటలోని కోకిల స్వరంలాగ మనోహరంగా ఉంటాయి. కాని అల్ప బుద్ధుల మాటలు అట్లా కాదు. కాకి కూతల్లా కర్ణ కఠోరంగా ఉంటాయంటున్నాడు వేమన. ప్రాజ్ఞుడు అంటే పండితుడు. అతడు కర్మదూరుడు. అంటే కర్మల్లో చిక్కుపడనివాడు. కోకిల లాగ మధురంగా మాట్లాడుతాడు. రెండోవాడుపూర్తి వివరాలు ...
తుంట వింటి వాని తూపుల ఘాతకు మింటి మంటి నడుమ మిడుక తరమె? ఇంటి యాలి విడిచి యెట్లుండవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ కుటుంబ వ్యవస్థ లోపల గాని, బయటగాని విరహం విరహమే. ఈ భూమ్యాకాశాల మధ్య విరహమంతటి దుస్తర బాధ లేదని అంటున్నాడు వేమన. వేమన జీవితంలోని పరిణామాన్ని ఈ పద్యం సూచిస్తుందేమో తెలియదు. గతంలో భర్తతో సయోధ్య లేని భార్య గురించి అనేక పద్యాలు చెప్పాడు. వేశ్యా జీవితాలనుపూర్తి వివరాలు ...
తనకు ప్రాప్తిలేక దాతలివ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్ల ముక్క వంకజూచి ముకురంబు దూరుట విశ్వదాభిరామ వినురవేమ దాత తనకు ద్రవ్య సహాయం చెయ్యటం లేదనే ఆక్రోశంతో అతన్ని నిందించటం అవివేకం. నిజానికి తనకా అదృష్టం ఉందా లేదా అని ఆలోచించాలి. ఇలా ఆలోచించకపోవడం ఎట్లా ఉంటుందంటే, తన ముక్కు వంకరగా ఉందని మర్చిపోయి, అద్దమే దానిని వంకర చేసి చూపించిందని తూలనాడినట్టు, అంటున్నాడు వేమన.పూర్తి వివరాలు ...
ఆశల తెగ గోసి అనలంబు చల్లార్చి గోచి బిగియ బెట్టి కోపమడచి గుట్టు మీరువాడు గురువుకు గురువురా విశ్వదాభిరామ వినురవేమ కోరికలను మొదలంటా నరికేసుకోవాలి. మనసులో చెలరేగే మోహమనే నిప్పును ఉపశమింపజేసుకోవాలి. కామ ప్రక్రియతో పనిలేకుండా అంటే గోచిని విప్పే పనిలేకుండా చేసుకోవాలి. అయినదానికీ కానిదానికీ వచ్చే కోపాన్ని నిర్మూలించుకోవాలి. అప్పుడే బ్రహ్మ రహస్యం తెలుస్తుంది. అలా తెలుసుకున్నవాడే గురువవుతాడు. గురువు కాదు పరమ గురువవుతాడు అని సెలవిస్తున్నాడు వేమన.పూర్తి వివరాలు ...
వెర్రి వానికైన వేషధారికినైన రోగికైన పరమ యోగికైన స్ర్తీల జూచినపుడు చిత్తంబు రంజిల్లు విశ్వదాభిరామ వినురవేమ అతడు పిచ్చివాడు కావొచ్చు, సందర్భానికో వేషం మార్చేవాడు కావొచ్చు, వ్యాధిగ్రస్తుడు కావొచ్చు. చివరికి గొప్ప యోగి కావొచ్చు, వీరున్నారే, వీరు నలుగురూ స్ర్తీలను చూసినప్పుడు మాత్రం ఎంతో కొంత కామ వికారానికి లోనవుతారు అని వేమన లోకానుభవంతో చెప్తున్న మాట. ఈ పద్యంలో స్ర్తీ సౌందర్య శక్తితో పాటు అన్ని రకాల వారూ స్ర్తీ వ్యామోహానికి గురయ్యే లోకరీతిని చూపిస్తున్నాడు […]పూర్తి వివరాలు ...