కడప: యువనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 15న కడప పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్ విజయలక్ష్మి ఈ నెల 16న నామినేషన్ వేయనున్నారు. కడప, పులివెందుల స్థానాల్లో మే 8వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Saturday, April 2, 2011
కడప : కడప లోక్సభకు మే 8వ తేదీన జరగనున్న ఉప ఎన్నిక రసవత్తరం కానున్నది. 1989 సంవత్సరం జరిగిన ఎంపి ఎన్నికల నాటి నుంచి 2009 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ కడప లోక్సభను హస్తగతం చేసుకుంది. కాగా దివంగత వైయస్రాజశేఖర్రెడ్డి కుటుంబ సభ్యులే ఎంపిలుగా ఎన్నికయ్యారు. కాగా 1977 సంవత్సరంలో జరిగిన కడప లోక్సభ ఎన్నికలలో రెడ్డికాంగ్రెస్ అభ్యర్థి కందుల ఓబులరెడ్డి, జనతాపార్టీ అభ్యర్థి రామిరెడ్డిపై గెలుపొందారు.పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Friday, February 25, 2011
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తన అల్లుడు సజ్జల శ్రీధర్రెడ్డికి మద్దతిచ్చి బలపరచాలని నంద్యాల ఎంపీ ఎస్పీవై.రెడ్డి కోరారు. కడప నగరంలోమాజీ కార్పొరేటర్లు, జగన్వర్గ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీవై.రెడ్డి మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి తనకు చాలా సన్నిహితుడని చెప్పారు. తాను అడిగిన వెంటనే వైఎస్ జగన్ మాజీ డీసీసీ అధ్యక్షుడు కె.సురేష్బాబును పోటీ నుంచి విరమింపజేసి, తన అల్లుడు సజ్జల శ్రీధర్రెడ్డికి మద్దతు ప్రకటించడం సంతోషకరమన్నారు. శ్రీధర్రెడ్డికి మద్దతు […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, February 24, 2011
లింగాల : కడప పార్లమెంట్కు త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో తన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పోటీలో ఉండరని వ్యవసాయశాఖ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తెలిపారు. లింగాల కుడికాలువను ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం ఎంపీపీ ఇంట్లో ఆయన విలేకరులతోమాట్లాడారు.రాజశేఖరరెడ్డికి పార్టీ ఎంపీ టిక్కెట్ వద్దని చెప్పడానికే ఢిల్లీ వెళ్లానన్నారు. ఎమ్మెల్సీ టిక్కెట్ అడగలేదని, అధిష్టానం ఆదేశాల మేరకు పని చేస్తానన్నారు. ఎమ్మెల్సీ టిక్కెట్ ఎవరికిస్తారనే దానిపై ఆయన స్పందిస్తూ నారాయణరెడ్డి, గోవిందరెడ్డి, వరదరాజులరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయన్నారు. […]పూర్తి వివరాలు ...