కడప: వైఎస్సార్ కాంగ్రెస్ రెండో ప్లీనరీ సమావేశం ఫిబ్రవరి 2వ తేదీన ఇడుపుల పాయలో జరుగుతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి ఈ సమావేశంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగనుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఇడుపులపాయలో పార్టీ పాలక మండలి(సీజీసీ) సమావేశం, అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూలు వెలువడనుంది. 2వ తేదీన ప్లీనరీ జరుగుతున్నపుడే అధ్యక్ష ఎన్నిక ఫలితం కూడా వెల్లడిస్తారు. పార్టీ సంస్థాగత ఎన్నికల కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం హైదరాబాదులోని పార్టీ కేంద్ర […]పూర్తి వివరాలు ...
“అధికారం లేదా పదవి అనేది మత్తు మందులా పని చేస్తుంది. ఆ మత్తులో జోగే వాడు దాని నుంచి బయటకు రావటానికి సుతరామూ ఇష్టపడడు. అంతేకాదు ఆ మత్తు కోసం దేన్నైనా పణంగా పెడతారు వాళ్ళు. ఈ మాటలు రాయలసీమ నాయకులకు అచ్చంగా సరిపోతాయి. ఎందుకంటే వారికి అధికారం కావాలి కానీ అక్కడి ప్రజల బతుకు వెతలు పట్టవు. సీమ నాయకులలో 70 శాతం మందికి అక్కడి సాగు, తాగు నీటి సమస్యలపైన అవగాహన లేదు. ఒకవేళ […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరులో అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నంద్యాల వరదరాజులురెడ్డి టీడీపీ పార్టీలో చేరుతున్నారన్న ఊహాగానాలు భారీగా ఊపందుకున్నాయి. ఇప్పటికే ఒకసారి కాంగ్రెస్ నుండి వైకాపా లోకి వెళ్ళిన వరద అక్కడ ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపధ్యం కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్తితి కనిపిస్తుండడంతో వరద తెదేపా వైపు చూస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఆయన వీటిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన వరద చేయలేదు. 2009లో వరదరాజులురెడ్డి కాంగ్రెస్ టిక్కెట్పై […]పూర్తి వివరాలు ...
కాంగ్రెసు సంస్కృతి పూర్తిగా రాష్ట్రంలో అమలు జరుగుతున్న రోజులలో కేంద్రం తన ఇష్టం వచ్చినట్లు ముఖ్యమంత్రులను పేకముక్కలవలె మార్చేసింది. చెన్నారెడ్డిని తొలగించి అంజయ్యను, ఆయనను పక్కన పెట్టి భవనం వెంకట్రామ్ ను ముఖ్యమంత్రిగా చేశారు. అదంతా ఇందిరాగాంధీ అధిష్ఠాన వర్గం చదరంగంలో భాగమే. 1978లో భవనం వెంకట్రామ్ విద్యామంత్రి అయ్యాడు. చెన్నారెడ్డి ఆయనను తరువాత కౌన్సిల్ సభ్యుడుగా చేశారు. ఆ దశలో డా. తంగిరాల సుభాష్ నాకు భవనం వెంకట్రామ్ ను పరిచయం చేశాడు. భవనం వెంకట్రామ్ సోషలిస్టు […]పూర్తి వివరాలు ...
సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు తిరస్కరణకు గురయ్యాయి. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా దాదాపు రెండు నెలల కిందట కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన 13 మంది ఎంపీలు తమ లోక్సభ సభ్యత్వాలకు సమర్పించిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ శుక్రవారం తిరస్కరించారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీలకు చెందిన లోక్సభ సభ్యుల రాజీనామాలు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వచ్ఛందంగా చేసినవి కావని.. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ఏర్పడిన తీవ్రమైన భావోద్వేగాల నడుమ తీసుకున్న […]పూర్తి వివరాలు ...
జమ్మలమడుగు కాంగ్రెస్ శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి వైకాపా గూటికి తిరిగొచ్చారు. ఈ రోజు హైదరాబాదులో దీక్ష చేస్తున్న జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో కడప ఉప ఎన్నికల సమయంలో ఆయన జగన్ కే మద్దతు ఇచ్చారు. కాకపోతే ఆ తర్వాత కాంగ్రెస్ అదికారంలో ఉండడంతో తనకు వ్యక్తిగతం గా వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జగన్ కు కొంత దూరంగా ఉండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు చెబుతున్నారు. ఆయన సోదరుడు నారాయణరెడ్డి […]పూర్తి వివరాలు ...
తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. 35 ఏళ్లుగా కాంగ్రెస్ను నమ్ముకుని ఎనలేని సేవలందించినా, సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా కేబినెట్లో టీ.నోట్ను పెట్టడంపై సాయిప్రతాప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీమాంధ్ర ప్రజలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన కాంగ్రెస్ను వీడడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, పీసీసీ అధ్యక్షుడికి కూడా పంపానన్నారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు […]పూర్తి వివరాలు ...
క్విడ్ ప్రో కో కేసులో అరెస్టయి, 16 నెలలుగా జైలులో ఉన్న కడప పార్లెంటు సభ్యుడు, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం… సోమవారం జగన్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ‘కేసులోని అన్ని అంశాలపై దర్యాప్తు ముగిసింది’ అని సీబీఐ దాఖలు చేసిన మెమో మేరకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. బెయిల్ పిటిషన్పై వాదోపవాదాలు, పలు కంపెనీల ద్వారా జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు […]పూర్తి వివరాలు ...
హెడ్డింగ్ చూసి ఆశ్చర్య పోతున్నారా? ఇది నిజం. మీరు అవునన్నా కాదన్నా రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం జైలులో ఉన్న జగన్ కు ప్రచారం చేసి పెట్టి తద్వారా వైకాపాకు మరిన్ని ఓట్లు పడేలా కృషి చేయాలని కాకలు తీరిన చంద్రబాబు గారి నేతృత్వంలోని తెదేపా కీలక నిర్ణయం తీసుకుంది. మాకు తెలుసు తెదేపా అభిమానులు, కార్యకర్తలు ఈ విషయం విని విస్మయానికి గురవుతారని. కానీ నిజం నిష్టూరంగానే ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం సంక్షోభంలో ఉంది. […]పూర్తి వివరాలు ...