అది కడప పట్టణానికి ఒకప్పుడు ప్రాణాధారం. కడప ప్రజలకు తియ్యని నీరు అందించే అపురూపమై’నది’. పాలకొండలలోని పెద్ద అగాడి ప్రాంతంలో నీటి బుగ్గలుగా ప్రారంభమై సెలయేరుగా మారి అనేక ప్రాంతాల వారికి దోవలో నీరు ఇస్తూ, చెరువులను నింపుతూ పంటలకు ప్రాణ ధారమై విలసిల్లిన అందాలనది. 500 సంవత్సరాల పూర్వము నుంచి సుమారు 50 సంవత్సరాల క్రితం వరకు ఈ నీటి అందాలను చూడటానికి అనేక మంది ఈ ప్రాంతాలకు వచ్చేవారుట. ఎప్పుడూ వరదలతో, ఇసుక దిన్నెలతో […]పూర్తి వివరాలు ...
భీమవరం బుల్లోడు చిత్ర యూనిట్ శుక్రవారం కడపకు వచ్చింది. స్థానిక రవి థియేటర్లో వారు అభిమానులతో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర నటీ నటులు సునీల్, ఎస్తేర్ డ్యాన్స్ చేసి అలరించారు. ఈ సందర్భంగా అభిమానుల నుండి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు పోలీసులు చిత్ర యూనిట్ కు భద్రత కల్పించారు.పూర్తి వివరాలు ...
ప్రపంచంలోనే అరుదైన కలివికోడి కదలికలను గుర్తించేందుకు సిద్దవటం రేంజీకి అదనంగా మరో 46 డిజిటల్ కెమేరాలు మంజూరయ్యాయి. వీటిని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ అమెరికాలో కొనుగోలు చేసిందని, ఆ విదేశీ కెమేరాలను ఇక్కడకు తీసుకొచ్చేందుకు అటవీశాఖ సిబ్బంది గురువారం ముంబైలోని బీఎన్హెచ్ఎస్కు వెళ్లారని సిద్దవటం రేంజి అటవీక్షేత్రాధికారి సుబ్బరాయుడు తెలిపారు. కలివికోడి కదలికలను గుర్తించేందుకు ఇప్పటికే 50 డిజిటల్ కెమేరాలు రెడ్డిపల్లి చుట్టుపక్కల గ్రామాలలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే!.పూర్తి వివరాలు ...
II విష్ణు ఉవాచః II నమో రుద్రాయ శాంతాయ బ్రహ్మణే పరమాత్మనే I కపర్దినే మహేశాయ జ్యోత్స్నాయ మహతే నమః II త్వం హి విశ్వసృపాం స్రష్టా ధాతా తవం ప్రపితామహః I త్రిగుణాత్మా నిర్గుణశ్చ ప్రకృతైః పురుషాత్పరః II నమస్తే నీలకంఠాయ వేధసే పరమాత్మనే I విశ్వాయ విశ్వబీజాయ జగదానన్దహేతవే II ఓంకారస్త్వం వషట్కార స్సర్వారంభ ప్రవర్తకః I హన్తకారస్స్వధాకారో హవ్యకవ్యాన్నభుక్ సదా II నమస్తే భగవన్ రుద్ర భాస్కరామితతేజసే పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరులో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 8.30 మధ్య జరుగనున్న దివ్య సత్సంగ్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ అనుగ్రహ భాషణం చేయనున్నారు. ఇందుకోసం టీబీ రోడ్డులో ఉన్న అనిబిసెంట్ పురపాలిక మైదానం భారీ వేదికతో సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం గురూజీ శిష్యులు పర్యటన వివరాలను వెల్లడించారు. శనివారం ఉదయం 7 గంటలకు రవిశంకర్ గురూజీ ప్రత్యేక రైలులో హైదరాబాద్ కాచిగూడ నుంచి ప్రొద్దుటూరుకు బయల్దేరనున్నారు. 22 బోగీలున్న ఈ రైలులో వెయ్యిమంది శిష్యులు ఉంటారన్నారు. […]పూర్తి వివరాలు ...
హెడ్డింగు చూసి ఆశ్చర్యపోయే ముందు కాస్త నిభాయించుకోండి. ఎందుకంటే రైల్వే మంత్రి ఖార్గే గారడీ చేసి బడ్జెట్ ను తియ్యగా కనిపించేట్లు చేశారు. నిజం చెప్పాలంటే రైల్వే బడ్జెట్ విషయంలో జిల్లాకు మళ్లీ మొండి చెయ్యే ఎదురైంది. జిల్లా మీదుగా నాలుగు రైళ్ళు నడవనున్నా అవి సగటున సంవత్సరానికి కేవలం 42 రోజులు మాత్రమే నడుస్తాయి. అంటే సంవత్సరమంతా కలిపి కేవలం ఒకటిన్నర నెల రోజులు మాత్రమే మనకు ఈ రైళ్ళు అందుబాటులో ఉంటాయి. నాలుగు రైళ్ళని […]పూర్తి వివరాలు ...
కడపను క్రీడల ఖిల్లాగా తయారు చేస్తామని కలెక్టర్ కోన శశిధర్ ప్రకటిం చారు. ఇక్కడి వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో అఖిల భారత బ్యాడ్మింటన్ సబ్ జూనియర్ ర్యాంకింగ్ పోటీలను శుక్రవారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. కడపలో తొలిసారి ర్యాంకింగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు మంచి సూచనలు ఇస్తే రాబోయే కాలంలో మరింత పకడ్బందీగా క్రీడా పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తానని […]పూర్తి వివరాలు ...
తెలుగు సాహితీ పుస్తకాల ప్రచురణ, అమ్మకాలలో అగ్రగామిగా పేరు గాంచిన విశాలాంధ్ర సంస్థ కడప నగరంలో పుస్తకాల అంగడిని ఏర్పాటు చేసింది. స్థానిక నాగారాజుపేటలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ పుస్తకాల అంగడిని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాలాంధ్ర 16 పుస్తకాలయాలు నిర్వహిస్తున్నట్లు విశాలాంధ్ర విజ్ఞాన సమితి జనరల్ మేనేజర్ హరినాథరెడ్డి, బాధ్యుడు రామసుబ్బారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో యోగివేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య శ్యాంసుందర్, […]పూర్తి వివరాలు ...
ఆం.ప్ర రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు తలమానికం మంగంపేట (ఓబులవారిపల్లి మండలం, కడప జిల్లా) ముగ్గురాళ్ళ గనులు – ఇవి ప్రపంచంలోనే ప్రసిద్దిగాంచిన ముగ్గురాళ్ళ గనులు. 1980కి ముందు రాష్ట్ర ప్రభుత్వం మంగంపేటలో సర్వే చేసినప్పుడు 72 మిలియన్ టన్నుల ముగ్గురాయి నిక్షేపాలు ఇక్కడ ఉన్నట్లు వెల్లడయ్యింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కేవలం పది మిలియన్ల పైచిలుకు టన్నుల ముగ్గురాళ్ళను మాత్రమే ఇక్కడ వెలికి తీశారు. ఇంకా సుమారు 60 మిలియన్ టన్నుల ముగ్గురాయి నిక్షేపాలు మంగంపేటలో […]పూర్తి వివరాలు ...