మీడియా దృష్టి మరల్చేందుకు ప్రభుత్వ వ్యూహరచన? కడప: రాయలసీమ జిల్లాల నుండి రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో రైతులు సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన కార్యక్రమానికి తరలివెళ్ళే అవకాశం ఉండటంతో నిఘావర్గాలు రంగంలోకి దిగాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాయలసీమ నాలుగు జిల్లాల నుండి ఎంతమంది రైతులు సిద్దేశ్వరం వెళ్ళవచ్చు అనే అంశంపై ఒక అంచనాకు వచ్చిన నిఘా వర్గాలు అలుగు శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించాయి. రాయలసీమ జిల్లాల నుండి […]పూర్తి వివరాలు ...
మాజీ మంత్రి డి.ఎల్ రవీంద్రా రెడ్డి గురించి ఈ మధ్య ఆయన సొంత నియోజకవర్గంలో ఒక ప్రచారం జోరందుకుంది. అదేమిటంటే … రాబోయే సార్వత్రిక ఎన్నికల బరిలో దిగినా దిగాకపోయినా తెదేపాకు సహకరిస్తారని – అందుకు నజరానాగా చంద్రబాబు తదనంతరం డిఎల్ రవీంద్రారెడ్డి గారికి రాజ్యసభ సీటు ఇస్తారని. ఇదే విషయాన్ని తెలుగు తమ్ముళ్ళు డిఎల్ కు ప్రతిపాదించారని, అందుకు ఆయన సుముఖంగా ఉన్నారని ఊహాగానాలు జోరందుకున్నాయి. డిఎల్ కూడా ఇందుకు సిద్దమయ్యే పక్షంలో మైదుకూరు నియోజకవర్గంలో […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరులో అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నంద్యాల వరదరాజులురెడ్డి టీడీపీ పార్టీలో చేరుతున్నారన్న ఊహాగానాలు భారీగా ఊపందుకున్నాయి. ఇప్పటికే ఒకసారి కాంగ్రెస్ నుండి వైకాపా లోకి వెళ్ళిన వరద అక్కడ ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంతో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపధ్యం కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్తితి కనిపిస్తుండడంతో వరద తెదేపా వైపు చూస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఆయన వీటిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన వరద చేయలేదు. 2009లో వరదరాజులురెడ్డి కాంగ్రెస్ టిక్కెట్పై […]పూర్తి వివరాలు ...
నికర జలాలతో స్వాతంత్య్రం అనంతరం ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదు రెండు దశాబ్ధాలుగా గడిచినా పూర్తి కాని మిగులు జలాల ప్రాజెక్టులు పోతిరెడ్డి పాడును వ్యతిరేఖించిన కోస్తా, తెలంగాణ నాయకులు కోస్తాంధ్రకు పోలవరాన్ని ప్రకటించిన కేంద్రం మనకేమిచ్చింది? తెలంగాణ వారిలాగా మనం కూడా ఓ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం మంచిది ఆరు శతాబ్దాల చరిత్రలో అతి విషమఘట్టంలో వున్న రాయలసీమ వాసులకు ఇప్పుడు రాష్ట్రవిభజన మరింత ప్రమాదకరంగా మారిందని, రాష్ట్రం వీడిపోతే జలయుద్ధాలు తప్పవని రిటైర్డ్ చీఫ్ […]పూర్తి వివరాలు ...
డీ ఎల్ కి తెలుగు దేశం నేతలు గాలమేసే ప్రయత్నాలు చేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే తెదేపా డీఎల్కు రాయబారం పంపి మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ పట్ల అంతగా వ్యతిరేకత చూపని డీఎల్కు జిల్లాలో కీలక బాధ్యత అప్పగిస్తామని ఆ పార్టీ నేతలు భరోసా ఇస్తున్నారు. అయితే ఈ ఆహ్వానం పట్ల డీఎల్ నుంచి ఇంతవరకు సానుకూల స్పందన రాకపోవడంతో వేచి చూసే ధోరణిలో టీడీపీ నేతలు ఉన్నారు. రాబోయే ఎన్నికలలో తెదేపా […]పూర్తి వివరాలు ...
వైకాపా చీఫ్, కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా అని మొన్న సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్పై విచారణ సమయంలో సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూశారు. ఐతే సుప్రీంకోర్టు బెయిల్ పిటీషన్ను తోసిపుచ్చింది. దీంతో పార్టీ శ్రేణులంతా నిరాశ చెందాయి. కానీ జగన్ అభిమానులు, ముఖ్యంగా యువత సామాజిక సైట్ ఫేస్ బుక్లో జగన్కు బెయిల్ వస్తుందనీ, నెక్ట్స్ సీఎం జగనే అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు. జగన్ బయటకొస్తే వార్ వన్ సైడేననీ… […]పూర్తి వివరాలు ...
హీరో రాజశేఖర్ కు జగన్ రెడ్డికి ఎక్కడ తగాదా వచ్చింది? ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగాను, ఆసక్తకరంగాను ఉంది. విజయవాడలో జగన్ దీక్ష కార్యక్రమం నిర్వహించినప్పుడు రాజశేఖర్ సభా వేదికమీద అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. అంతేకాక ఆయన పదే,పదే మీసాలు తిప్పుతూ తిరగడం చూసి పలువురు జగన్ చెవిలో గుసగుసలాడారు. ఇదేమి పద్దతి ఆయన మీసాలు తిప్పుకుంటూ వేదిక మీద తిరిగితే జనం ఏమనుకుంటారు? సీరియస్ నేస్ లేదని అనుకోరా అని వ్యాఖ్యానించారట.పూర్తి వివరాలు ...