మాధవరంపోడు – కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలో కడప – రేణిగుంట రహదారిని ఆనుకుని ఉన్న ఒక గ్రామం. ఏంటీ ఊరు ప్రత్యేకత ? జిమ్మటాయిలకు (గబ్బిలాలు), వాటి ఆవాసాలైన చెట్లకు ఈ ఊరోళ్లు పూజలు చేస్తారు. ఎందుకలా ? గబ్బిలాలకు పూజలు చేస్తే రోగాలు తగ్గిపోతాయని, పక్షి దోషం పోతుందని మాధవరంపోడో ల్ల నమ్మకం. ఈ నమ్మకం చుట్టుపక్కల ఊళ్లకు కూడా వ్యాపించింది. జిమ్మటాయిలను ఎట్లా పూజిస్తారు? పాలుమాలిన పిల్లోళ్లను ఆదివారం రోజున గబ్బిలాలు ఉండే చెట్టుకాడికి తీసుకొచ్చి […]పూర్తి వివరాలు ...
కడప: ఈ రోజు నుండి పుష్పగిరి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్కుమార్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 4వ తేదీ బుధవారం క్షేత్రాధిపతి వైద్యనాధేశ్వరస్వామి, క్షేత్రపాలకుడు చెన్నకేశవస్వాముల గర్భాలయంలో గణపతి పూజలు, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, విశ్వక్షేనపూజ, మేధినీ పూజలతో ఉత్సవాలను ప్రారంభిస్తారు. 5వ తేదీ సాయంత్రం కొండపై వెలసిన చెన్నకేశవస్వామి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం, హోమాలు ఉంటాయి. 8న చందనోత్సవం నిర్వహిస్తారు. అక్షతదియ తిరుణాల ఈ నెల 9న ప్రారంభమవుతుంది. […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట: కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు (బుధవారం) ప్రత్యేక వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. హస్తా నక్షత్రయుక్త శుభలగ్నంలో రాత్రి 8 గంటలకు మొదలైన కల్యాణం 10 గంటల వరకూ సాగింది. ఉత్సవ విగ్రహాలను పల్లకీపై కొలువుదీర్చి ప్రధాన ఆలయం నుంచి శోభాయాత్రగా శిల్పకళా శోభితమైన కళ్యాణమండపం వద్దకు తీసుకువచ్చారు. వేదికపైన రజిత సింహాసనంపై కళ్యాణమూర్తులను ఆసీనులను చేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేసి […]పూర్తి వివరాలు ...
కడప: ఉగాది పర్వదినం సందర్భంగా శుక్రవారం దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుని దర్శనానికి ముస్లింలు పెద్ద సంఖ్యలో భక్తులతో కలిసి తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకుని కొబ్బరి కాయలు కొట్టి కానుకలు సమర్పించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించి లడ్డూలను కొనుగోలు చేశారు. బీబీ నాంచారమ్మను తాము కుమార్తెగా భావిస్తామని, ఆ దృష్ట్యా శ్రీనివాసుడు తమకు అల్లుడవుతాడని… ప్రతి ఏటా ఉగాది రోజున ఆయనకు దిన భత్యం సమర్పించి పూజలు నిర్వహించడం […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఏప్రిల్ 12వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 15న సాయంత్రం 4.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల షెడ్యూల్ : 14-04-16(గురువారం) మూలవర్ల అభిషేకం (ఉదయం), అంకురార్పణం (సాయంత్రం) 15-04-16(శుక్రవారం) ధ్వజారోహణం, శ్రీరామజయంతి (ఉదయం), […]పూర్తి వివరాలు ...
ఆంజనేయస్వామి జయంత్యుత్సవం పురస్కరించుకుని జిల్లాలో ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానాల్లో బుధవారం హనుమజ్జంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయాల నిర్వాహకులు భక్తులు స్వామిని దర్శించుకునేందుకు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా భక్తులు ఆంజనేయస్వామికి ఇష్టమైన ఆకుపూజలు చేయించి తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ఉదయం గణపతిపూజ, పుణ్యాహవాచనం, పురుషసూక్త, శ్రీసూక్త, నమక, చమక, మన్యుసూక్తపారాయణము, రుద్రహోమం, పూర్ణాహుతి, శ్రీరామాంజనేయ మూలమంత్ర జపం, అభిషేకం, అర్చన, నివేదనం, మంత్రపుష్పం […]పూర్తి వివరాలు ...
కడప: పుష్పగిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 20న చందనోత్సవం, 21న గరుడవాహనం, 22న కల్యాణం, 23 రధోత్సవం నిర్వహిస్తారు. వెయ్యిసంవత్సరాల పురాతత్వ విశేషం కలిగిన పుష్పగిరిలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు వల్లూరు మండల అధికారులు, పుష్పగిరి మఠం వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో తొలిసారిగా ఏడు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్టస్థ్రాయి పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. గ్రామీణ క్రీడలు, మేధోక్రీడలు, చిత్రలేఖన సాహిత్యం, సంస్కృతికి ప్రతిబింబాలుగా ఏడు అంశాలలో, […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట : కోదండరాముని రథోత్సవం శుక్రవారం కన్నుల పండువగా సాగింది. సీతాలక్ష్మణ సమేతుడై రథంపై ఊరేగి వచ్చిన కోదండరాముడు పుర వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు ఉత్సవ విగ్రహాలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రథం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథం వద్దకు ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి ఆశీనులను చేశారు. స్థానిక తహశీల్దార్ కనకదుర్గయ్య పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. రామనామస్మరణ […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలో గురువారం రాత్రి శ్రీసీతారాముల పెళ్లి ఉత్సవం శాస్త్రోక్తంగా, వైభవంగా జరిగింది. గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేర్వేరుగా స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తితిదే తరపున కార్యనిర్వహణాధికారి సాంబశివరావు పట్టు వస్త్రాలు అందజేశారు. అంతుకు ముందు సీతా రాములను వేర్వేరుగా వేద పండితులు, ఆలయ సిబ్బంది ఆలయం నుంచి కల్యాణ వేదిక వద్దకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామయ్య, సీతమ్మను కల్యాణ వేదికపైకి తెచ్చి నిర్వహించిన […]పూర్తి వివరాలు ...