‘‘యూపీఏ ప్రభుత్వం తనను రాజకీయంగా కానీ, మరో రకంగానైనా కానీ ఏ రూపంలో వ్యతిరేకించే వారినైనా.. అణచివేయటానికి, అప్రతిష్టపాలు చేయటానికి, నిర్మూలించటానికి.. సీబీఐ, ఈడీ, ఐటీ తదితర సంస్థలను ఎలా దుర్వినియోగం చేస్తోందో మీ దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నాను. యూపీఏ సర్కారు తీరు 1975 నాటి ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది. విస్తృత ప్రజాస్వామ్య ప్రయోజనాల కోసం ఈ నియంతృత్వ ధోరణులకు వ్యతిరేకంగా పోరాడేందుకు దేశంలోని అన్ని రాజకీయ పక్షాలూ ఏకం కావాల్సిన సమయం వచ్చింది.పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, June 19, 2011
జమ్మలమడుగు : ప్రముఖ టివి యాంకర్ ఉదయభాను, ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్లు అదివారం మండల పరిదిలొని గండికొట పరిసర ప్రాంతాల్లొ హల్చల్ చేశారు. మా టివి నిర్మాణ సారధ్యంలొ స్టైల్ సురేష్ దర్శకత్వ పర్యవేక్షణలొ ధండర్ స్టార్ రియాలీటి షొ కు సంభందించిన ఎపొసిడ్ చిత్రీకరణ చేశారు. ఈ సందర్బంగా స్దానిక గండికొట ప్రాంతంలొని అత్యంత రమణీయమైన లొయ ప్రాంతంలొ రియాలిటి షొ కు సంభందించిన కొండను త్రాడుతొ పట్టుకొని పైకి వెళ్ళే వాటికి సంభందించి చిత్రీకరించారు.పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, June 16, 2011
కడప : రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బీపీ ఆచార్య బుధవారం రాత్రి కడప పెద్ద దర్గాను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు దర్గా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పూలచాదర్ను స్వయంగా తెచ్చి దర్గాలోని ప్రధాన గురువుల మజార్ వద్ద సమర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శించుకుని ప్రార్థనలు చేశారు.పూర్తి వివరాలు ...
సంపాదకుడు
Saturday, June 11, 2011
కడప : జిల్లా పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కలెక్టర్ బంగ్లాలో శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శశిభూషణ్కుమార్ జెడ్పీటీసీలు, ఎంపీపీల రిజర్వేషన్లను ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ను జారీ చేయాల్సి ఉంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికలు నిర్వహించనున్నారు. జెడ్పీటీసీల రిజర్వేషన్లు షెడ్యూలు తెగలు : చిట్వేలు (మహిళ) షెడ్యూలు కులాలు : కోడూరు (మహిళ), వేముల (జనరల్), .పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, June 5, 2011
ఇవి ప్రొద్దుటూరు బండెద్దులు… కడప జిల్లా కోడెద్దులు…. రంకేసి కాలు దువ్వితే ఎంతటి బండయినా పరుగులు తీయాల్సిందే! గాడి వదలి పోటీకి వెళితే బహుమతులు వాటి సొంతమే. విజేతలుగా ఇల్లు చేరి యజమానుల మోజు తీర్చే ఈ ఎద్దులు వారికి కన్నకొడుకులతో సమానం. ఈ బండలాగుడు ఎద్దులపై దోమ వాలినా వారిని కుట్టినట్లే బాధపడతారు. భీముడనే ఓ ఎద్దు ఇటీవల ఆకస్మిక మృతి చెందగా, దాని సంస్మరణ జరుపుతున్నారంటే వీటిపై యజమానులకుండే మమకారం వేరే చెప్పాల్సిన అవసరం […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Friday, June 3, 2011
సుమారు వందేళ్ళ క్రితమే అంతరించిపోయిందని భావించిన కలివికోడి ఇరవై ఏళ్ళ కిందట 1986వసంవత్సరంలో మనదేశంలోని తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల, శేషాచలం పర్వతపంక్తులలోని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో సిద్దవటం-బద్వేలు మధ్య అటవీ ప్రాంతంలో ప్రత్యక్షమై పక్షిశాస్త్ర వేత్తలనూ, ప్రకృతి ప్రేమికులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. కలివికోడి రక్షణకు గత ఇరవై ఏళ్ళగా పలుచర్యలను తీసుకుంటున్నారు. ..ఆ పక్షి ఉనికికే ప్రమాదం కలిగే రీతిలో జరిగిన పరిణామాలు ప్రపంచవ్యాప్త చర్చకు దారితీశాయి. కలివికోడికి ఆవాస ప్రాంతమైన లంకమల పరిథిలో తెలుగుగంగ […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, May 29, 2011
కడప : జిల్లాలోని పవిత్రపుణ్యక్షేత్రం పుష్పగిరిలో శనివారం సాయంత్రం శ్రీజ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న (ఇంకాపేరుపెట్టని) ప్రొడక్షన్నెంబరు1 సినిమా చిత్రీకరణ జరిగింది. నిర్మాణంలో భాగంగా హీరో రోహిత్, హీరోయిన్ శ్రీలపై సన్నివేశాన్ని చిత్రీకరించారు. పీఎన్రెడ్డి దర్శకత్వంలో నిర్మాత మదన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సుకుమార్ కాగా మగధీరా సినిమాలో నటించిన సంపత్రాజు ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ గుడి నుంచి వస్తుండగా హీరో ఆమెను చూస్తూ అందానికి ముగ్దుడై పరవశించే సన్నివేశాన్ని చిత్రీకరించారు.పూర్తి వివరాలు ...
సంపాదకుడు
Sunday, May 29, 2011
గాలివీడు: గాలివీడు మండలంలోని చీమలచెరువుపల్లి పంచాయతీ ఎర్రదొడ్డిపల్లిలో పురిగమ్మ వేల్పు శుక్ర, శనివారం ఘనంగా జరిగింది. 15 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేల్పునకు ప్రజలు భారీగా హాజరయ్యారు. శుక్రవారం రాత్రి వివిధ గ్రామాల నుంచి 12 నాణములు వేల్పులో పాల్గొన్నాయి. ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేశారు. శనివారం సాయంత్రం నిర్వహించిన దేవతా నాణములతో నీలకర్త కార్యక్రమం, పూజ, గందోడి కోలలాడే సంబరాలు,.పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, May 26, 2011
కలియుగ ప్రత్యక్షదైవం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, శ్రీ వెంకటేశ్వరస్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు. అందుకే ఆయన సన్నిధి ఎప్పుడూ జనసంద్రమే. ఆ స్వామిని సులభంగా దర్శించుకునే అవకాశం కల్పించడానికి, ఆయన సన్నిధిలో ఆర్జిత సేవలందించడానికి, తిరుమల గిరిపై శ్రమ లేకుండా ఒకరోజు సేద తీరేందుకు గదిని సంపాదించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ పద్ధతిలో ఈ-సేవ కౌంటర్లను ఏర్పాటు చేశారు.కడప నగరంలో మద్రాసురోడ్డులోని టీటీడీ కల్యాణ మండపంలో ఈ-సేవా కౌంటర్ ఏర్పాటు చేశారు.పూర్తి వివరాలు ...