ఘటనలు

డిసెం
2
శని
గాంధీజీ కడప నగర పర్యటన
డిసెం 2 @ 7:40 సా. – డిసెం 4 @ 8:25 సా.
గాంధీజీ కడప నగర పర్యటన

1933 డిసెంబరు 31 రాత్రి 7.40 గం.కి గాంధీజీ సపరివారంగా కడప చేరినారు. జిల్లా హరిజన సేవా సంఘ అధ్యక్షుడు వకీలు సంజీవ రెడ్డి మహాత్మునికి పూలదండ వేసి స్వాగతం చెప్పినారు. కడప రైల్వే ప్లాటుఫారం నిండా క్రిక్కిరిసిపోయిన జనం గాంధీజీని జయధ్వానాలతో ఆహ్వానించినారు. గాంధీజీ రైల్వే స్టేషను నుంచి త్రివర్ణ పతాకాలతోను, తోరణాలతోను రమ్యంగా అలంకరించిన మోటారు కారులో పోతూ ప్రజల అభినందనలను, తన సహజ మందహాసముతో అందుకుని శాంతినికేతనానికి పోయి అక్కడ బస చేసినారు.

1934 జనవరి 2న సాయంకాలం 6 గంటలకు గాంధీజీ కడప స్వదేశీ ఎంపోరియంకు ప్రారంభోత్సవం జరిపినారు.

కడప నుంచి గాంధీజీ, ఆయన బృందము జనవరి రెండవ తేదీ రాత్రి 8.25గం.కు రాయచూరు ప్యాసింజరు మూడవ తరగతి బండిలో గుత్తికి బయలుదేరినారు.

http://wp.me/p4r10f-2D

ఫిబ్ర
20
మంగ
హాస్యనటుడు పద్మనాభం వర్ధంతి
ఫిబ్ర 20 all-day
హాస్యనటుడు పద్మనాభం వర్ధంతి

ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నేపధ్య గాయకుడిగా బహుముఖ పాత్రలను పోషించిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు.

ఫిబ్రవరి 20, 2010 (శనివారం) ఉదయం గుండెపోటుతో  ఆయన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. అయిదేళ్ల వయసులోనే పద్మనాభం చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసి వెండికప్పు బహుమతిగా పొందారు. ‘మాయలోకం’ చిత్రం ద్వారా సినీరంగంలోకి ఆయన ప్రవేశించారు.

పద్మనాభం రేఖా అండ్‌ మురళి ఆర్ట్స్‌ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి ‘దేవత’ పొట్టి ప్లీడర్‌, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానలు నిర్మించారు. 1968లో శ్రీరామకథ చిత్రాన్ని నిర్మించటమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.

పద్మనాభం ఇంటర్వ్యూ ….https://kadapa.info/పద్మనాభం/

మార్చి
28
బుధ
పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి
మార్చి 28 all-day
పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి

తెలుగు సాహిత్యంలో ఇరవయ్యో శతాబ్దిలో అత్యంత ప్రతిభావంతులైన ఇంకా కొన్ని తరాలు కూడా చెప్పుకోగల గొప్ప రచయితలు ఐదుగురిని లేదా ఆరుగురిని ఎంపిక చేయాలంటే ఎవరు ఈ పరిగణనకు పూనుకున్నా అందులో శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఒకరై వుండడం అనివార్యం. పుట్టపర్తివారు మహాకవి. మహాపండితుడు. గొప్ప భక్తుడు. గొప్ప వాగ్గేయకారుడు. జ్ఞాని. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త.

పుట్టపర్తి నారాయణాచార్యులు 1914, మార్చి 28, న అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు.

ప్రొద్దుటూరు వీరి అత్తగారి ఊరు. మొదట ఆయన పని చేసింది అనంతపురంలో. కొన్నాళ్ళు తిరువాన్కూర్ లోనూ, కొన్నాళ్ళు ఢిల్లీ లోనూ, ప్రొద్దుటూరులోనూ పనిచేసి చివరకు కడపలో స్థిరపడ్డారు. కడపలో శ్రీ రామకృష్ణా ఉన్నత పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేశారు. సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది. శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు ఆయనకు డి.లిట్. ప్రదానం చేశాయి.

ఆయన కడప లోని రామకృష్ణా హైస్కూల్లో టీచర్ గా పని చేసి 1990 సెప్టెంబర్ 1న స్వర్గస్థులయ్యారు.

సెప్టెం
1
శని
పుట్టపర్తి నారాయణాచార్యుల వర్ధంతి
సెప్టెం 1 all-day
పుట్టపర్తి నారాయణాచార్యుల వర్ధంతి

తెలుగు సాహిత్యంలో ఇరవయ్యో శతాబ్దిలో అత్యంత ప్రతిభావంతులైన ఇంకా కొన్ని తరాలు కూడా చెప్పుకోగల గొప్ప రచయితలు ఐదుగురిని లేదా ఆరుగురిని ఎంపిక చేయాలంటే ఎవరు ఈ పరిగణనకు పూనుకున్నా అందులో శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఒకరై వుండడం అనివార్యం. పుట్టపర్తివారు మహాకవి. మహాపండితుడు. గొప్ప భక్తుడు. గొప్ప వాగ్గేయకారుడు. జ్ఞాని. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త.

పుట్టపర్తి నారాయణాచార్యులు 1914, మార్చి 28, న అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు.

 ప్రొద్దుటూరు వీరి అత్తగారి ఊరు. మొదట ఆయన పని చేసింది అనంతపురంలో. కొన్నాళ్ళు తిరువాన్కూర్ లోనూ, కొన్నాళ్ళు ఢిల్లీ లోనూ, ప్రొద్దుటూరులోనూ పనిచేసి చివరకు కడపలో స్థిరపడ్డారు. కడపలో శ్రీ రామకృష్ణా ఉన్నత పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేశారు. సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది. శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు ఆయనకు డి.లిట్. ప్రదానం చేశాయి.

ఆయన కడప లోని రామకృష్ణా హైస్కూల్లో టీచర్ గా పని చేసి 1990 సెప్టెంబర్ 1న స్వర్గస్థులయ్యారు.

 

నవం
16
శుక్ర
శ్రీభాగ్ ఒడంబడిక కుదిరిన రోజు
నవం 16 all-day
శ్రీభాగ్ ఒడంబడిక కుదిరిన రోజు

మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా వున్న తెలుగు వారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1913 లో ఆంధ్రమహాసభను ఏర్పాటు చేసుకున్నారు, ఉద్యమించారు. రాయలసీమ వారికి సర్కార్‌ జిల్లాల వాళ్ళు భాషా సంస్కృతుల పరంగా తమను తక్కువ చూస్తున్నారనే అనుమానం ఉండేది.

రాయలసీమ వాసుల అనుమానాల్ని తీర్చడానికి, అగాధాల్ని తగ్గించడానికి ఆంధ్ర మాహాసభ ఉపసంఘము ఏర్పాటు చేసినారు. ఈ ఉపసంఘము పలు దఫాలుగా చర్చలు జరిపి 16 -11 -1937 లో నాటి మద్రాసు నగరంలోని కాశీనాధుని నాగేశ్వర రావు ఇంటి(శ్రీభాగ్)లో తుది తీర్మానము చేయుటకు సమావేశమైంది. ఆ సమావేశములో పాల్గొన్న రాయలసీమ, కోస్తా నాయకులు ఒక ఒడంబడికను కుదుర్చుకొని సంతకం చేసినారు. ఆ ఒప్పందమే శ్రీభాగ్‌ ఒడంబడికగా ప్రసిద్ది చెందింది.

1947 రాయలసీమ మహాసభలో నీలం సంజీవరెడ్డి ఈ విషయం ప్రస్తావించి ఆవేదన వెలిబుచ్చినారు. ఆ తరువాత 1953లో ఆంధ్రరాష్ట్రం, 1956 ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక కూడా శ్రీభాగ్‌ ఒప్పందం అమలు కాలేదని, సీమ వెనుక బాటుకు గురైందని, అన్ని రంగాల్లో సీమ వివక్షకు గురౌతున్నదనీ సీమ వాసులు అసంతృప్తితో ఉంటూ వచ్చారు.

ఈ శ్రీభాగ్ ఒప్పందం ఇప్పటి వరకూ అమలు కాలేదు. ఈ ఒప్పందం బయటకు రాకుండా కోస్తా నేతలు సీమ వాసులకు ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టారనే ఒక ఆరోపణ కూడా ఉంది.

శ్రీభాగ్ ఒప్పంద పత్రం కోసం ఈ వ్యాసం చదవండి: http://wp.me/p4r10f-12p

 

డిసెం
2
ఆది
గాంధీజీ కడప నగర పర్యటన
డిసెం 2 @ 7:40 సా. – డిసెం 4 @ 8:25 సా.
గాంధీజీ కడప నగర పర్యటన

1933 డిసెంబరు 31 రాత్రి 7.40 గం.కి గాంధీజీ సపరివారంగా కడప చేరినారు. జిల్లా హరిజన సేవా సంఘ అధ్యక్షుడు వకీలు సంజీవ రెడ్డి మహాత్మునికి పూలదండ వేసి స్వాగతం చెప్పినారు. కడప రైల్వే ప్లాటుఫారం నిండా క్రిక్కిరిసిపోయిన జనం గాంధీజీని జయధ్వానాలతో ఆహ్వానించినారు. గాంధీజీ రైల్వే స్టేషను నుంచి త్రివర్ణ పతాకాలతోను, తోరణాలతోను రమ్యంగా అలంకరించిన మోటారు కారులో పోతూ ప్రజల అభినందనలను, తన సహజ మందహాసముతో అందుకుని శాంతినికేతనానికి పోయి అక్కడ బస చేసినారు.

1934 జనవరి 2న సాయంకాలం 6 గంటలకు గాంధీజీ కడప స్వదేశీ ఎంపోరియంకు ప్రారంభోత్సవం జరిపినారు.

కడప నుంచి గాంధీజీ, ఆయన బృందము జనవరి రెండవ తేదీ రాత్రి 8.25గం.కు రాయచూరు ప్యాసింజరు మూడవ తరగతి బండిలో గుత్తికి బయలుదేరినారు.

http://wp.me/p4r10f-2D

ఫిబ్ర
26
శుక్ర
నటుడు వెంకటకృష్ణయ్య వర్ధంతి
ఫిబ్ర 26 all-day

నాటక రంగంలో విభిన్న పాత్రలు పోషించి, అభినవ చాకలి తిప్పడుగా పేరు తెచ్చుకున్న లక్కిరెడ్డిపల్లెకు చెందిన రంగస్థల కళాకారుడు వెంకటకృష్ణయ్య 26 ఫిబ్రవరి 2014న నాగులగుట్టపల్లిలో కన్నుమూశారు.

అభినవ చాకలి తిప్పడు ఇక లేరు

ఫిబ్ర
26
శని
నటుడు వెంకటకృష్ణయ్య వర్ధంతి
ఫిబ్ర 26 all-day

నాటక రంగంలో విభిన్న పాత్రలు పోషించి, అభినవ చాకలి తిప్పడుగా పేరు తెచ్చుకున్న లక్కిరెడ్డిపల్లెకు చెందిన రంగస్థల కళాకారుడు వెంకటకృష్ణయ్య 26 ఫిబ్రవరి 2014న నాగులగుట్టపల్లిలో కన్నుమూశారు.

అభినవ చాకలి తిప్పడు ఇక లేరు

ఫిబ్ర
26
ఆది
నటుడు వెంకటకృష్ణయ్య వర్ధంతి
ఫిబ్ర 26 all-day

నాటక రంగంలో విభిన్న పాత్రలు పోషించి, అభినవ చాకలి తిప్పడుగా పేరు తెచ్చుకున్న లక్కిరెడ్డిపల్లెకు చెందిన రంగస్థల కళాకారుడు వెంకటకృష్ణయ్య 26 ఫిబ్రవరి 2014న నాగులగుట్టపల్లిలో కన్నుమూశారు.

అభినవ చాకలి తిప్పడు ఇక లేరు

ఫిబ్ర
26
సోమ
నటుడు వెంకటకృష్ణయ్య వర్ధంతి
ఫిబ్ర 26 all-day

నాటక రంగంలో విభిన్న పాత్రలు పోషించి, అభినవ చాకలి తిప్పడుగా పేరు తెచ్చుకున్న లక్కిరెడ్డిపల్లెకు చెందిన రంగస్థల కళాకారుడు వెంకటకృష్ణయ్య 26 ఫిబ్రవరి 2014న నాగులగుట్టపల్లిలో కన్నుమూశారు.

అభినవ చాకలి తిప్పడు ఇక లేరు

error: