- Categories
-
Tags
bakkayapalli brahmani steels communist leader sivaramireddy cp brown cp brown library cpbrown cpbrown research center eddula eddula eswar eddula eswarreddy gandhi in kadapa gandhi in proddutur gandikota gandikota utsavalu go120 jagan reddy kadapa kadapa airport kadapa district kasinayana mahatma gandhi proddatur tour mj death anniversary muneyya narreddy sivaramireddy omc ontimitta brahmotsavams padmanabham padmanabham birth anniversary padmanabham death anniversary padmavati medical college puttaparti puttaparti narayanacharya birth anniversary puttaparti narayanacharyulu raaraa raaraa birth anniversary rayachoti rims sivaramireddy death anniversary sreebhag pact veerabhadra temple vivekanandareddy vontimitta brahmotsavam ycvreddy ycvreddy birth anniversary ycvreddy death anniversary yeddual eswarreddy ys ys birthday ys death anniversary ys jagan ys jagan sworn as ap cm ys viveka ys vivekananda reddy ysjagan ysr ysr birth anniversary ysr district yvreddy birthday అనంతరాజుపేట అన్నమయ్య జయంతి అన్నమాచార్యుల జయంతి అరవపల్లె అస్మిత : విమర్శనాత్మక వాస్తవికత - నా కథానిక ఆరాధన ఉక్కు కర్మాగారం ఉద్యాన కళాశాల ఎంజె వర్ధంతి ఎద్దుల ఈశ్వరరెడ్డి ఎమ్మనూరు చినవెంకటరెడ్డి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు ఓబులాపురం మైనింగ్ కంపెనీ కడప కడప జిల్లా కడప విమానాశ్రయం కడపలో గాంధీజీ కడపలో గాంధీజీ ఉపన్యాసం కలిమిశెట్టి మునెయ్య కాశినాయన కాశినాయన ఆరాధన కేతు విశ్వనాథరెడ్డి గండికోట గండికోట ఉత్సవాలు గాంధీజీ కడప పర్యటన గాంధీజీ పర్యటన చలసాని ప్రసాద్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జీవో120 జ్యోతి తవ్వా సురేష్ రెడ్డి ధ్వజారోహణం నందలూరు నర్రెడ్డి శివరామిరెడ్డి పత్తిపాక మోహన్ పద్మనాభం పద్మనాభం జయంతి పద్మనాభం వర్ధంతి పద్మావతి మహిళా వైద్య కళాశాల పుట్టపర్తి నారాయణాచార్యుల వర్ధంతి పెద్దమ్మ దేవర పోతన జయంతి ప్రొద్దుటూరు బక్కాయపల్లె దేవర బసవరాజు పద్మనాభం బ్రాహ్మణి ఉక్కు మద్రామాయణ ప్రవచనం మధురాంతకం రాజారాం ఉత్తమ కథలు ముఖ్యమంత్రిగా జగన్ ముత్తు మారమ్మ ముత్తుమారమ్మ ముత్తుమారమ్మ జాతర మునెయ్య మునెయ్య వర్ధంతి యెద్దుల ఈశ్వరరెడ్డి రాచమల్లు రామచంద్రారెడ్డి రాజశేఖరరెడ్డి రాయచోటి రాయలసీమ రాయలసీమ అభివృద్ది సదస్సు రారా జయంతి రారా వర్ధంతి రిమ్స్ రైల్వే కోడూరు లక్కోజు సంజీవరాయశర్మ విక్టరీ హైస్కూలు విరసం వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వెంకటకృష్ణ వెంకటకృష్ణయ్య వై.ఎస్.రాజశేఖర రెడ్డి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జయంతి వైఎస్ పుట్టినరోజు వైఎస్ ప్రమాణస్వీకారం వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ వర్ధంతి వైఎస్ఆర్ జిల్లా వైవిరెడ్డి జయంతి వైసివి రెడ్డి వైసివి రెడ్డి జయంతి వైసివి రెడ్డి వర్ధంతి వైస్ జగన్ శివరామిరెడ్డి వర్ధంతి శ్రీభాగ్ శ్రీభాగ్ ఒడంబడిక శ్రీభాగ్ ఒప్పందం శ్రీరామజయంతి సంజీవరాయశర్మ సామవేదం షణ్ముఖ శర్మ సి.పి.బ్రౌన్ సింగమనేని నారాయణ సిద్దేశ్వరం అలుగు సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన సిపి బ్రౌన్ సిపిబ్రౌన్
2015 జూన్ 7న కడప విమానాశ్రయం ప్రారంభమైంది. బెంగుళూరు నుండి ఆ రోజు (ఆదివారం) ఉదయం 10 గంటల 40 నిముషాలకు బయలుదేరిన ఎయిర్ పెగాసస్ విమానం ( OP 131) 11 గంటల 30 నిముషాలకు కడప విమానాశ్రయానికి చేరుకుంది. సుమారు 60 మంది ప్రయాణికులు ఈ విమానం ద్వారా బెంగుళూరు నుండి కడపకు వచ్చారు.
విమానాశ్రయ టర్మినల్ భవనాన్ని అప్పటి ఆం.ప్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు.
రిజర్వ్ బ్యాంకు ఇరవై ఒకటవ గవర్నర్ గా పనిచేసిన వై.వి.రెడ్డి 1964 బ్యాచ్ కు చెందిన IAS (ఐ.ఏ.ఎస్) అధికారి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరుగా ఐదేళ్ళు పనిచేసి 2008 ఆగస్టులో పదవీవిరమణ చేసిన డా. వై.వి.రెడ్డి పూర్తి పేరు యాగా వేణుగోపాల్ రెడ్డి. అంతకు పూర్వం ఆయన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా, Bank for International Settlements, Asian Consultative Council (ACC) చైర్మన్ గా కూడా పనిచేశారు. ఆయన ఉద్యోగ జీవితం దాదాపు పూర్తిగా ఆర్థిక, ప్రణాళికా రంగాల్లోనే సాగింది. ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.
1941 ఆగస్టు 17న కడప జిల్లా పుల్లంపేట మండలం కొమ్మనవారిపల్లె గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి యాగా పిచ్చిరెడ్డి ఆ రోజుల్లోనే అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎన్నో ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. నంద్యాల కలెక్టర్గా కూడా ఆయన పనిచేశారు.
ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నేపధ్య గాయకుడిగా బహుముఖ పాత్రలను పోషించిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు.
ఫిబ్రవరి 20, 2010 (శనివారం) ఉదయం గుండెపోటుతో ఆయన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. అయిదేళ్ల వయసులోనే పద్మనాభం చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసి వెండికప్పు బహుమతిగా పొందారు. ‘మాయలోకం’ చిత్రం ద్వారా సినీరంగంలోకి ఆయన ప్రవేశించారు.
పద్మనాభం రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి ‘దేవత’ పొట్టి ప్లీడర్, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానలు నిర్మించారు. 1968లో శ్రీరామకథ చిత్రాన్ని నిర్మించటమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.
పద్మనాభం ఇంటర్వ్యూ ….https://kadapa.info/పద్మనాభం/
వైసివిరెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి అభ్యుదయవాది- కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల గ్రామంలో 14-2-1924న జన్మించారు.
1968 ఏప్రిల్నుండి 1969 అక్టోబర్ దాకా, రా.రా.సంపాదకత్వంలో వెలువడిన ‘సంవేదన’ త్రైమాసిక పత్రిక, ప్రచురణ కర్తగా, ‘యుగసాహితి’ సంస్థను నిర్వహించారు. వైసివి కథలన్నీ 1982లో ‘గట్టిగింజలు’ అన్న సంపుటిగా వెలువడ్డాయి. ‘తొలకరి చినుకులు’ అన్న ఖండకావ్యం, ‘గుత్తి చరిత్ర’ అన్న చిరుకావ్యం కూడా రాశారు.
1972 నుండి కడపజిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడుగా ఎన్నో కవి సమ్మేళనాలు, గోష్టులు నిర్వహించారు.
1989 అక్టోబరు 8వ తేదీన కడప మున్సిపల్ హైస్కూల్లో జరుగుతున్న అభ్యుదయ రచయితల సభల్లో పాల్గొంటూ, మధ్యాహ్న భోజన విరామంలో హఠాత్తుగా గుండెపోటు రావటంతో కన్నుమూశారు.
వైసివి రెడ్డి గురించి జానమద్ది రాసిన వ్యాసం … http://wp.me/p4r10f-wF
మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా వున్న తెలుగు వారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1913 లో ఆంధ్రమహాసభను ఏర్పాటు చేసుకున్నారు, ఉద్యమించారు. రాయలసీమ వారికి సర్కార్ జిల్లాల వాళ్ళు భాషా సంస్కృతుల పరంగా తమను తక్కువ చూస్తున్నారనే అనుమానం ఉండేది.
రాయలసీమ వాసుల అనుమానాల్ని తీర్చడానికి, అగాధాల్ని తగ్గించడానికి ఆంధ్ర మాహాసభ ఉపసంఘము ఏర్పాటు చేసినారు. ఈ ఉపసంఘము పలు దఫాలుగా చర్చలు జరిపి 16 -11 -1937 లో నాటి మద్రాసు నగరంలోని కాశీనాధుని నాగేశ్వర రావు ఇంటి(శ్రీభాగ్)లో తుది తీర్మానము చేయుటకు సమావేశమైంది. ఆ సమావేశములో పాల్గొన్న రాయలసీమ, కోస్తా నాయకులు ఒక ఒడంబడికను కుదుర్చుకొని సంతకం చేసినారు. ఆ ఒప్పందమే శ్రీభాగ్ ఒడంబడికగా ప్రసిద్ది చెందింది.
1947 రాయలసీమ మహాసభలో నీలం సంజీవరెడ్డి ఈ విషయం ప్రస్తావించి ఆవేదన వెలిబుచ్చినారు. ఆ తరువాత 1953లో ఆంధ్రరాష్ట్రం, 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక కూడా శ్రీభాగ్ ఒప్పందం అమలు కాలేదని, సీమ వెనుక బాటుకు గురైందని, అన్ని రంగాల్లో సీమ వివక్షకు గురౌతున్నదనీ సీమ వాసులు అసంతృప్తితో ఉంటూ వచ్చారు.
ఈ శ్రీభాగ్ ఒప్పందం ఇప్పటి వరకూ అమలు కాలేదు. ఈ ఒప్పందం బయటకు రాకుండా కోస్తా నేతలు సీమ వాసులకు ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టారనే ఒక ఆరోపణ కూడా ఉంది.
శ్రీభాగ్ ఒప్పంద పత్రం కోసం ఈ వ్యాసం చదవండి: http://wp.me/p4r10f-12p
21 మే 2007 – ఏటా రెండు మిలియన్ టన్నుల సామర్ధ్యంతో కడప జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం.
21 మే 2007 – ఏటా రెండు మిలియన్ టన్నుల సామర్ధ్యంతో కడప జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం.
21 మే 2007 – ఏటా రెండు మిలియన్ టన్నుల సామర్ధ్యంతో కడప జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం.
21 మే 2007 – ఏటా రెండు మిలియన్ టన్నుల సామర్ధ్యంతో కడప జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం.