ఆదివారం , 29 సెప్టెంబర్ 2024

ఘటనలు

సెప్టెం
26
శని
గండికోట ఉత్సవాలు
సెప్టెం 26 – సెప్టెం 27 all-day
గండికోట ఉత్సవాలు

కడప: ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ గండికోట ఉత్సవాలను సెప్టెంబర్ 26న నిర్వహించాలని కలెక్టర్ వెంకటరమణ ఆదేశించారు. బుధవారం సభాభవన్‌లో నిర్వహించిన జిల్లా పర్యాటక ప్రమోషన్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26న గండికోట ఉత్సవాలు, 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.

కార్యక్రమాలను నిర్వహించేందుకు వేదిక, రిసెప్షన్, పార్కింగ్ స్థలం, అప్రోచ్ స్థలం, ఎగ్జిబిషన్, విద్యుత్తు దీపాలు తదితర వసతులు కల్పించాలని ఆదేశించారు. ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని చెప్పారు. తాగునీటి సమస్యను 15రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. గండికోట ప్రాశస్థ్యం తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి గోపాల్ మాట్లాడుతూ.. జిల్లాలోని 23 పర్యాటక వసతి, సమాచార భవనాలన్ని దేవాదాయశాఖ స్థలాల్లో నిర్మించారన్నారు. గండికోట నుండి మైలవరం వరకు జల విహారయానం, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తీసుకోవాలని చెప్పారు. స్థానిక పర్యాటక కేంద్రాల అభివృద్ధికి రెండుకోట్ల రూపాయలు బడ్జెట్‌లో ఉందన్నారు. యాత్రికులను ఆకర్షించేలా పుష్పగిరి దేవాలయం, ఆమీన్‌పీర్ దర్గా, చింతకొమ్మదిన్నె మండలంలోని గంగమ్మ దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఇంతకీ ఈ సారైనా గండికోట ఉత్సవాలు జరుగుతాయా?

సెప్టెం
27
ఆది
కడప రిమ్స్ ప్రారంభమైన రోజు
సెప్టెం 27 all-day
కడప రిమ్స్ ప్రారంభమైన రోజు

కడప నగర శివారులోని పుట్లంపల్లి వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ వైద్య, నర్సింగ్ కళాశాలలను అప్పటి ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు యుపిఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ 27 సెప్టెంబర్ 2006న ప్రారంభించారు. ఇదే రోజున సోనియా గాంధీ గారు రిమ్స్ దంతవైద్య కళాశాల నిర్మాణానికి పునాది రాయి వేశారు.

ఈ కార్యక్రమంలో ఆనాటి ఆం.ప్ర ముఖ్యమంత్రి వైఎస్ తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.

అక్టో
4
ఆది
‘మధురాంతకం రాజారాం ఉత్తమ కథలు’ పుస్తకావిష్కరణ @ సిపి బ్రౌన్ గ్రంధాలయం, యర్రముక్కపల్లి
అక్టో 4 @ 10:00 ఉద. – 12:00 సా.

ఉపన్యాసకులు :

డా. పత్తిపాక మోహన్, సహాయ సంపాదకులు, నేషనల్ బుక్ ట్రస్ట్ (స్వాగత వచనం)

ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి (పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు)

ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి (సభాధ్యక్షత)

ఎం నారాయణ శర్మ (పుస్తక సమీక్ష)

సింగమనేని నారాయణ (పుస్తక సంపాదకులు, ప్రసంగిస్తారు)

ఆహ్వాన పత్రం:

madhuranatakam rajaram uttama kathalu

అక్టో
8
గురు
వైసివి రెడ్డి వర్ధంతి
అక్టో 8 all-day

వైసివిరెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి అభ్యుదయవాది- కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల గ్రామంలో 14-2-1924న జన్మించారు.

ycvreddy1968 ఏప్రిల్‌నుండి 1969 అక్టోబర్‌ దాకా, రా.రా.సంపాదకత్వంలో వెలువడిన ‘సంవేదన’ త్రైమాసిక పత్రిక, ప్రచురణ కర్తగా, ‘యుగసాహితి’ సంస్థను నిర్వహించారు. వైసివి కథలన్నీ 1982లో ‘గట్టిగింజలు’ అన్న సంపుటిగా వెలువడ్డాయి. ‘తొలకరి చినుకులు’ అన్న ఖండకావ్యం, ‘గుత్తి చరిత్ర’ అన్న చిరుకావ్యం కూడా రాశారు.

1972 నుండి కడపజిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడుగా ఎన్నో కవి సమ్మేళనాలు, గోష్టులు నిర్వహించారు.

1989 అక్టోబరు 8వ తేదీన కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో జరుగుతున్న అభ్యుదయ రచయితల సభల్లో పాల్గొంటూ, మధ్యాహ్న భోజన విరామంలో హఠాత్తుగా గుండెపోటు రావటంతో కన్నుమూశారు.

వైసివి రెడ్డి గురించి జానమద్ది రాసిన వ్యాసం … http://wp.me/p4r10f-wF

అక్టో
22
గురు
రాయలసీమ విద్రోహదినం
అక్టో 22 all-day

విభజన తరువాత ఆం.ప్ర పాలనా పగ్గాలు చేపట్టిన తెదేపా అందరి సలహాలను, నివేదికలనూ పట్టించుకోకుండా

నవం
16
సోమ
శ్రీభాగ్ ఒడంబడిక కుదిరిన రోజు
నవం 16 all-day
శ్రీభాగ్ ఒడంబడిక కుదిరిన రోజు

మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా వున్న తెలుగు వారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1913 లో ఆంధ్రమహాసభను ఏర్పాటు చేసుకున్నారు, ఉద్యమించారు. రాయలసీమ వారికి సర్కార్‌ జిల్లాల వాళ్ళు భాషా సంస్కృతుల పరంగా తమను తక్కువ చూస్తున్నారనే అనుమానం ఉండేది.

రాయలసీమ వాసుల అనుమానాల్ని తీర్చడానికి, అగాధాల్ని తగ్గించడానికి ఆంధ్ర మాహాసభ ఉపసంఘము ఏర్పాటు చేసినారు. ఈ ఉపసంఘము పలు దఫాలుగా చర్చలు జరిపి 16 -11 -1937 లో నాటి మద్రాసు నగరంలోని కాశీనాధుని నాగేశ్వర రావు ఇంటి(శ్రీభాగ్)లో తుది తీర్మానము చేయుటకు సమావేశమైంది. ఆ సమావేశములో పాల్గొన్న రాయలసీమ, కోస్తా నాయకులు ఒక ఒడంబడికను కుదుర్చుకొని సంతకం చేసినారు. ఆ ఒప్పందమే శ్రీభాగ్‌ ఒడంబడికగా ప్రసిద్ది చెందింది.

1947 రాయలసీమ మహాసభలో నీలం సంజీవరెడ్డి ఈ విషయం ప్రస్తావించి ఆవేదన వెలిబుచ్చినారు. ఆ తరువాత 1953లో ఆంధ్రరాష్ట్రం, 1956 ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక కూడా శ్రీభాగ్‌ ఒప్పందం అమలు కాలేదని, సీమ వెనుక బాటుకు గురైందని, అన్ని రంగాల్లో సీమ వివక్షకు గురౌతున్నదనీ సీమ వాసులు అసంతృప్తితో ఉంటూ వచ్చారు.

ఈ శ్రీభాగ్ ఒప్పందం ఇప్పటి వరకూ అమలు కాలేదు. ఈ ఒప్పందం బయటకు రాకుండా కోస్తా నేతలు సీమ వాసులకు ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టారనే ఒక ఆరోపణ కూడా ఉంది.

శ్రీభాగ్ ఒప్పంద పత్రం కోసం ఈ వ్యాసం చదవండి: http://wp.me/p4r10f-12p

 

నవం
24
మంగ
రారా వర్ధంతి
నవం 24 all-day
రారా వర్ధంతి

1922 ఫిబ్రవరి 28 వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా పైడిపాలెం గ్రామంలో జన్మించిన రామ చంద్రా రెడ్డి తెలుగు సాహితీ లోకానికి ” రా.రా” గా ప్రసిద్ధులు. తెలుగు సాహితీ విమర్శలో రా.రా. కు ప్రత్యేక స్థానం ఉంది.

ఈయన ఇంజనీరింగ్ పట్టభద్రులు (మద్రాసు). వీరి సంపాదకత్వంలో 1959-63 కాలంలో కడప నుండి వెలువడిన ” సవ్యసాచి ” , 1968-69 కాలంలో వెలువడిన ” సంవేదన ” పత్రికలు తెలుగు సాహిత్యంలో ఒక సంచలనం కలిగించాయి. వీరి ” అనువాద సమస్యలు ” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

అలసినగుండెలు (కథా సంపుటి), సారస్వతవివేచన, వ్యక్తి స్వాతంత్ర్యం- సమాజశ్రేయస్సు , బాల సాహిత్యం, నాటికలు, అనువాద రచనలను చేశారు. మాస్కో లోని ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకులుగా కూడా పని చేశారు. రా.రా 1988 నవంబరు 24న తుది శ్వాస వదిలారు.

 

నవం
25
బుధ
రాయలసీమ అభివృద్ది సదస్సు @ హరిత హోటల్
నవం 25 @ 10:00 ఉద. – 1:00 సా.

హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రభుత్వ మాజీ సలహాదారు శ్రీరామ్‌రెడ్డి, ఏపీ మాజీ ఐజీ హనుమంతరెడ్డి, రాయలసీమ అభ్యుదయ సంఘం కన్వీనరు ఇస్మాయిల్‌రెడ్డి ఈ సదస్సులో పాల్గొంటారు.

 

డిసెం
31
గురు
గాంధీజీ కడప నగర పర్యటన
డిసెం 31 2015 @ 7:40 సా. – జన 2 2016 @ 8:25 సా.
గాంధీజీ కడప నగర పర్యటన

1933 డిసెంబరు 31 రాత్రి 7.40 గం.కి గాంధీజీ సపరివారంగా కడప చేరినారు. జిల్లా హరిజన సేవా సంఘ అధ్యక్షుడు వకీలు సంజీవ రెడ్డి మహాత్మునికి పూలదండ వేసి స్వాగతం చెప్పినారు. కడప రైల్వే ప్లాటుఫారం నిండా క్రిక్కిరిసిపోయిన జనం గాంధీజీని జయధ్వానాలతో ఆహ్వానించినారు. గాంధీజీ రైల్వే స్టేషను నుంచి త్రివర్ణ పతాకాలతోను, తోరణాలతోను రమ్యంగా అలంకరించిన మోటారు కారులో పోతూ ప్రజల అభినందనలను, తన సహజ మందహాసముతో అందుకుని శాంతినికేతనానికి పోయి అక్కడ బస చేసినారు.

1934 జనవరి 2న సాయంకాలం 6 గంటలకు గాంధీజీ కడప స్వదేశీ ఎంపోరియంకు ప్రారంభోత్సవం జరిపినారు.

కడప నుంచి గాంధీజీ, ఆయన బృందము జనవరి రెండవ తేదీ రాత్రి 8.25గం.కు రాయచూరు ప్యాసింజరు మూడవ తరగతి బండిలో గుత్తికి బయలుదేరినారు.

http://wp.me/p4r10f-2D

ఫిబ్ర
13
శని
రజతోత్సవ వేడుకలు @ విక్టరీ హైస్కూల్
ఫిబ్ర 13 – ఫిబ్ర 14 all-day

విక్టరీ హైస్కూల్ ప్రారంభమై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలియచేశారు.

error: