లింగాల : అనంతపురం జిల్లాకు చెందిన కొంత మంది వైఎస్సార్ అభిమానులు వైఎస్ మాలదారణ చేసి ఇరుముడితో ఇడుపులపాయకు పాదయాత్ర చేపట్టారు. అనంతరుపురం నగరానికి చెందిన గాలి నరసింహారెడ్డి, నీరుగంటి నారాయణరెడ్డి, రాజమోహన్, లక్ష్మున్న, ఓబిరెడ్డి, వెంకటరామిరెడ్డి, నీలకంఠారెడ్డిలు వైఎస్ మాల ధరించి, ఇరుముడితో 29వతేదీన అనంతపురం నుంచి బయలు దేరారు. బత్తలపల్లె, దాడితోట, పార్నపల్లె, లింగాల,పూర్తి వివరాలు ...
కడప జిల్లా మైదుకూరులో తెలుగుభాషా దినోత్సవం ఘనంగా జరిగింది . మైదుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో తెలుగు భాషాభిమానులు , ఉపాధ్యాయులూ ,విద్యార్థుల మధ్య సమక్షం లో ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాష ఉనికికిపూర్తి వివరాలు ...
కడప : కడప కళాక్షేత్రంలో ఈ నెల 29వతేదీ తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ అనిల్కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబరులో తెలుగుభాషా దినోత్సవ నిర్వహణపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 29వతేదీ గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా ప్రతి ఏటా ప్రభుత్వం తెలుగుభాషా దినోత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు.పూర్తి వివరాలు ...
ప్రపంచంలో గల వృక్ష సంపదలో దాదాపు 12శాతం మొక్కలు భారత దేశంలో వున్నాయి. దేశంలో 5 వేల శైవలాల జాతులు, 1,600 లైకెన్ జాతులు, 20వేల శిలీంధ్ర జాతులు, 2,700 బ్రయోఫైట్లు, 600 టెరిడోఫైట్లు, 18000 పుష్పించు మొక్కల జాతులువున్నాయి.రాయలసీమ వైశాల్యం 69,043 చదరపు కీలోమీటర్లు. రాయలసీమలో మూడు రకాల అడవులున్నాయి.చిత్తడి ఆకురాల్చు అడవులు, మొదటివి. కర్నూలు జిల్లాలోనిపూర్తి వివరాలు ...
పులివెందుల, ఆగస్టు 11 : అవినీతి, అక్రమాల విషయంలో మచ్చలేని కుటుంబం తమదని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. స్థానిక లయోలా కళాశాల అవరణలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ అవినీతి, అక్రమాల పర్వం తమ వంశంలోనే లేదన్నారు. మంచి తనం నేర్పించిన తమ తల్లిదండ్రులు మంచి బుద్ధిని కూడా ప్రసాదించారని తెలిపారు.పూర్తి వివరాలు ...
మైదుకూరు : ప్రేమ పేరుతో నయవంచన చేసి అమ్మాయిలను ముంబై,పూణేలకు తరలించి అమ్మకం చేసే నల్గురు ముఠా సభ్యులపై మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల మైదుకూరులోని ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుకుంటున్న విద్యార్థిని ముంబైకి తరలిస్తూ పట్టుబడిన కేసులో మైదుకూరుకు చెందిన గడ్డం జగన్, వారి తల్లి సారమ్మ, రాయచోటి ఏరియా నీలం కంఠ్రావుపేటకు చెందిన దిల్షర్,పూర్తి వివరాలు ...
కడప : జిల్లా పరిషత్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కలెక్టర్ బంగ్లాలో శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శశిభూషణ్కుమార్ జెడ్పీటీసీలు, ఎంపీపీల రిజర్వేషన్లను ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లా పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ను జారీ చేయాల్సి ఉంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికలు నిర్వహించనున్నారు. జెడ్పీటీసీల రిజర్వేషన్లు షెడ్యూలు తెగలు : చిట్వేలు (మహిళ) షెడ్యూలు కులాలు : కోడూరు (మహిళ), వేముల (జనరల్), .పూర్తి వివరాలు ...
గాలివీడు: గాలివీడు మండలంలోని చీమలచెరువుపల్లి పంచాయతీ ఎర్రదొడ్డిపల్లిలో పురిగమ్మ వేల్పు శుక్ర, శనివారం ఘనంగా జరిగింది. 15 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేల్పునకు ప్రజలు భారీగా హాజరయ్యారు. శుక్రవారం రాత్రి వివిధ గ్రామాల నుంచి 12 నాణములు వేల్పులో పాల్గొన్నాయి. ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేశారు. శనివారం సాయంత్రం నిర్వహించిన దేవతా నాణములతో నీలకర్త కార్యక్రమం, పూజ, గందోడి కోలలాడే సంబరాలు,.పూర్తి వివరాలు ...
కడప : జిల్లాలో పనిచేస్తున్న 25 మంది తహశీల్దార్లను వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తూ బుధవారం రాత్రి కలెక్టర్ శశిభూషణ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ జి.శ్రీనివాసులును ప్రొద్దుటూరు తహశీల్దార్గా నియమించారు. కలెక్టరేట్ ఎఫ్ సెక్షన్ సూపరింటెండెంట్ కె వెంకటరెడ్డిని మైదుకూరు తహశీల్దారుగా నియమిం చారు. రాజంపేట ఆర్డీఓ కార్యాలయంలో ఏఓ గా పనిచేస్తున్న పి. భవానీని సంబేపల్లె తహశీల్దారుగా, .పూర్తి వివరాలు ...