వార్తా విభాగం

శాసనాలు

వన్డాడి (వండాడి) శాసనము

శాసనము : వండాడి శాసనము ప్రదేశం : వండాడి, రాయచోటి తాలూకా శాసనకాలం: ఎనిమిదవ శతాబ్దం రేనాటి చోళుల తరువాత ఎనిమిదవ శతాబ్ది తుదియందు కడప మండలము బాణ రాజులకును,వైదుంబ రాజులకును వశమయ్యెను. వైదుంబులు మొదట చిత్తూరు మండలములో నుండెడివారు. వారికి వైదుమ్బవ్రోలు అను నగరము రాజధాని. తర్వాత రేనాటి చోళులను నిర్జించి చిర్పులి నాక్రమించుకొనిరి.కొంతకాలమునకు పొత్తపి (రాజం పేట తాలూక), కలకడ (వాయల్పాడు తాలూక) నగరములు కూడ వీరికి రాజధానులయినట్లు శాసనము లందు కలదు.రేనాటి చోళులవలె […]పూర్తి వివరాలు ...

కళాకారులు జానపద గీతాలు

మహనందయ్య – జానపద కళాకారుడు (చెక్కభజన)

రెండు చెక్కలను లయాత్మకంగా కొట్టడం ద్వారా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించి దానికి అనుగుణంగా అడుగులు వేసే కళ చెక్కభజన. చెక్కభజనలో అడుగులకు అనుగుణంగా పాటలో వేగం, ఊపు, ఉంటాయి. చాలారకాల అడుగులున్నాయి . ఆది అడుగు, రెండు, మూడు, పర్ణశాల, కుప్పకొట్టడం, కులుకు వంటివి ప్రత్యేకమైన అడుగులు. ఈ అడుగులకు అనుగుణంగా చెక్కలు కొడుతుంటారు. గురువు మధ్యలో ఉండి పాట పాడతాడు. జానపదులు ఆదరించిన కళారూపాల్లో చెక్కభజనకు విశేషమైన స్థానం ఉంది. చెక్కభజనను జానపదులకు దగ్గర చెయ్యడంలో […]పూర్తి వివరాలు ...

జానపద గీతాలు

శివశివ మూరితివి గణనాతా – భజన పాట

కోలాట కోపుల్లో తాలుపుగట్టి మొదటిది. ‘శివశివ మూరితివి’ అనే ఈ పాట తాలుపుగట్టి కోపుల్లో కడప జిల్లాలో జానపదులు పాడుకునే గణపతి ప్రార్థనా గీతమిది.. వర్గం : భజన పాటలు శివశివ మూరితివి గణనాతా – నువ్వు శివునీ కుమారుడవు గణనాతా ||శివ|| బుద్ది నీదే బుద్ది నీదే గణనాతా ఈ జగతి గొలుచు దేవుడవు గణనాతా ||శివ|| సదువు నీదే సాము నీదే గణనాతా సారస్వతి నీకు దండం గణనాతా ||శివ|| బాపనోళ్ళు నిన్ను గొలువ […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా ఒకటే అనుకోవడం ఒక పద్ధతి (రాయలసీమలోనే జిల్లాల మధ్య అభివృద్ధిలో ఉన్న అంతరాల దృష్ట్యా, అలాగే విభజనానంతర అనుభవాల దృష్ట్యా కూడా నేను దీన్ని బలంగా వ్యతిరేకిస్తాను). అభివృద్ధిలో ఎక్కువ వెనుకబడిన జిల్లాలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలనుకోవడం ఇంకొక పద్ధతి. రాయలసీమలో హైకోర్టు అంటే కర్నూల్లో హైకోర్టు అనే అభిప్రాయం ఒకటి బలంగానే వ్యాప్తిలో ఉంది. […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర ప్రాబల్యం గురించిన అభిప్రాయాలు ఇప్పటికీ అలాగే ఉండడం వల్ల అప్పటి శ్రీభాగ్ ఒప్పందాన్ని అనుసరించి రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయటం ఇప్పుడు అనివార్యతగా మారింది. ఐతే ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన అమరావతి ప్రాంతంలోనే జస్టిస్ సిటీ పేరుతో హైకోర్టు ఏర్పాటుచెయ్యబూనడంతో హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చెయ్యాలనే డిమాండుతో దీక్షలు, ఆందోళనలు జరుగుతున్నాయి…. పైకి ఉద్యమకారులు […]పూర్తి వివరాలు ...

వార్తలు

రైతు నేత డిఎన్ నారాయణ ఇక లేరు

కృష్ణాపురంలో అంత్యక్రియలు మైదుకూరు: రాయలసీమ రైతాంగ మౌలిక సమస్య లపై తనదైన రీతిలో పోరాటం సాగించిన మైదుకూరు రైతుసేవా సంఘం అధ్యక్షుడు డి.యన్.నారాయణ(63) శనివారం ఉదయం మైదుకూరులో మరణించా రు. నారాయణకు రెండేళ్ల కిందట గుండె శస్త్ర చికిత్స జరిగింది. రెండు రోజుల కిందట అస్త్వస్థతకు గురి కావడంతో తిరుపతికి తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్ధితి పూర్తిగా క్షీణించింది. నారాయణ అపస్మారక స్ధితిలోకి వెళ్ళిపోవడంతో  ఇంటికి తీసుకు వెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో ఆయనను శుక్రవారం రాత్రి […]పూర్తి వివరాలు ...

ఈ-పుస్తకాలు

రాయలసీమ వైభవం – Rayalaseema Vaibhavam

‘రాయలసీమ వైభవం’ – రాయలసీమ ఉత్సవాల సావనీర్ . సంపాదకత్వం: తవ్వా ఓబుల్ రెడ్డి, ప్రచురణ : రాయలసీమ ఆర్ట్ థియేటర్ – జులై, 2008లో ప్రచురితం.పూర్తి వివరాలు ...

వార్తలు

ఆధునిక సాంకేతికతే పిచ్చుకలకు శాపం

మారుతున్న ప్రజల జీవన విధానాలే మనుషుల్లో ఒకటిగా బతుకుతున్న పిచ్చుకలు కనుమరుగయ్యేలా చేస్తున్నాయని, జీవ వైవిధ్యానికీ , పర్యావరణ సమతుల్యానికి ఎంతగానో మేలు చేసే పిచ్చుకలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ రచయిత, పప్పన్నపల్లె పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తవ్వా ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా, మైదుకూరు మండల పరిధిలోని పప్పన్నపల్లె గ్రామ పంచాయతీలోని పప్పన పల్లె గ్రామంలో గల మండల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (H.W), అమ్మ సేవా సమితి ప్రపంచ పిచ్చుకల […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కరుణించవయ్య యిఁక కడు జాణవౌదువు – అన్నమయ్య సంకీర్తన

ప్రొద్దుటూరు చెన్నకేశవుని స్తుతించిన అన్నమాచార్య సంకీర్తన ప్రొద్దుటూరు లేదా పొద్దుటూరు, వైఎస్ఆర్ జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణము. రెండవ బొంబాయిగా ప్రసిద్ది చెందినది. పెన్నా నదికి ఉత్తర ఒడ్డున ఉన్న ప్రొద్దుటూరు వ్యాపారాలకు నిలయంగా ఉంది. ఇక్కడి పాత మార్కెట్ దగ్గర ఉన్న పురాతన మహాలక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి ఆలయాన్ని పదకవితా పితామహుడు సందర్శించినట్లు చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తోంది.  పొద్దుటూరు చెండ్రాయుని (చెన్నకేశవుని) యెడల తన మధుర భక్తిని శృంగార సంకీర్తనా రూపంలో అన్నమాచార్యుడు […]పూర్తి వివరాలు ...

error: