కడప: కడప-బెంగుళూరు మధ్య నడుస్తోన్నఎయిర్ పెగాసస్ విమానం గురువారం ఉదయం కడపలో ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించక సుమారు అరగంటకు పైగా గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం ఏటీసీ అనుమతితో విమానాన్ని పెలైట్ సురక్షితంగా కిందకు దించారు. దాదాపు 45 నిమిషాలు ఆలస్యంగా టేకాఫ్ తీసుకొని బెంగుళూరుకు వెళ్లింది. బెంగుళూరు నుంచి ఉదయం 10.45కు 30 మంది ప్రయాణీకులతో బయలుదేరిన ఈ విమానం 11.30 గంటలకు కడపలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించక పోవడంతో […]పూర్తి వివరాలు ...
పోయిన వారం విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి కడపకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రులూ, అధికారుల సమక్షాన మాట్లాడుతూ “కడప జిల్లాకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం” అని ఘనంగా ప్రకటించేశారు. ఆయన వివిధ సందర్భాల్లో జిల్లాకిచ్చిన హామీలన్నీ కలిపి జాబితా తయారుచేస్తే ఒక ఉద్గ్రంథమౌతుంది. రాజకీయ నాయకులన్నాక చాలా సందర్భాల్లో చాలా చాలా హామీలు అటు ఆంతరంగిక సమావేశాల్లోనూ, ఇటు బహిరంగ సభల్లోనూ కూడా ఎన్నెన్నో ఇచ్చేస్తూ ఉంటారు. వాటిని పట్టుకుని నిలదీయాలనుకోవడం […]పూర్తి వివరాలు ...
ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయాలని కోరుతూ మంగళవారం జిల్లా వ్యాప్తంగా వైకాపా శ్రేణులు ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించాయి. కడపలో… కడప కలెక్టరేట్ దగ్గర మేయర్ సురేష్బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి ధర్నా చేశారు. అనంతరం మాట్లాడుతూ…తన అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఓటుకు నోటు వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూస్తున్నారని పేర్కొన్నారు. పులివెందులలో… అవినీతి చంద్రబాబు గద్దె దిగాలంటూ వైకాపా నేతలు, కార్యకర్తలు పులివెందులలో భారీ ర్యాలీ నిర్వహించారు. […]పూర్తి వివరాలు ...
ఫోన్లో మాట్లాడిన ఆ గొంతు చంద్రబాబుదే కడప: ఓటుకు నోటు వ్యవహారంలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో ఫోన్ లో మాట్లాడుతూ దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మండలి ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. చంద్రబాబు వెంటనే తన ముఖ్యమంత్రిపదవికి రాజీనామా చేసి ఏసీబీ విచారణకు సిద్ధపడాలన్నారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు […]పూర్తి వివరాలు ...
♦ చంద్రబాబుకు జయలలితకు పట్టిన గతే ♦ ఓటుకు నోటు వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉంది ♦ సింగపూర్ ప్రజాస్వామ్యం ఇలాగే ఉంటుందా? కడప: ‘ఆంధ్రప్రదేశ్ అన్నాహజారేను నేనే’.. అని గొప్పలు చెప్పుకొనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడు సీఎం జయలలిత మాదిరి జైలుకెళ్లక తప్పదని మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి జోస్యం చెప్పారు. స్థానిక వైకాపా కార్యాలయంలో ఆదివారం నగర మేయర్ కె.సురేష్బాబు, కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథ్రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా […]పూర్తి వివరాలు ...
అప్పులేని సంసార మైనపాటే చాలు తప్పులేని జీతమొక్క తారమైన జాలు // పల్లవి // కంతలేని గుడిసొక్క గంపంతైన జాలు చింతలేని యంబలొక్క చేరెడే చాలు జంతగాని తరుణి యేజాతైన నాదె చాలు వింతలేని సంపదొక్క వీసమే చాలు // అప్పులేని // తిట్టులేని బ్రదుకొక్క దినమైన నదే చాలు ముట్టులేని కూడొక్క ముద్దడే చాలు గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైన చాలు వట్టిజాలి బడుకంటే వచ్చినంతే చాలు // అప్పులేని // లంపటపడని మేలు లవలేసమే […]పూర్తి వివరాలు ...
సీమ ప్రజలు అభద్రతా భావంలో ఉన్నారు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం రాజీలేని పోరాటం కడప: కడప జిల్లా అంటే ముఖ్యమంత్రికి చిన్నచూపని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ‘కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు’ అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన రఘువీరారెడ్డి మాట్లాడుతూ… కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం కాంగ్రెస్ రాజీలేని పోరాటం చేస్తుందని, ఇందుకోసం ప్రజలతో మమేకమై […]పూర్తి వివరాలు ...
కడప: బెంగుళూరు నుండి ఈరోజు (ఆదివారం) ఉదయం 10 గంటల 40 నిముషాలకు బయలుదేరిన ఎయిర్ పెగాసస్ విమానం ( OP 131) 11 గంటల 30 నిముషాలకు కడప విమానాశ్రయానికి చేరుకుంది. సుమారు 60 మంది ప్రయాణికులు ఈ విమానం ద్వారా బెంగుళూరు నుండి కడపకు వచ్చారు. అంతకు మునుపు విమానాశ్రయ టర్మినల్ భవనాన్ని ఆం.ప్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. దీంతో కడప విమానాశ్రయం అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లైంది. ఈ కార్యక్రమంలో కేంద్ర […]పూర్తి వివరాలు ...
కడప: ఈరోజు ఉదయం 11 గంటల 15 నిముషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడప విమానశ్రయ టెర్మినల్ను ప్రారంభించనున్నారు. కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సుజనా చౌదరి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి ఎయిర్పోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ప్రారంభోత్సవానికి సంబంధించి జిల్లా యంత్రాంగం, విమానాశ్రయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు […]పూర్తి వివరాలు ...