వార్తా విభాగం

పుస్తకావిష్కరణలు వార్తలు

19న పి రామకృష్ణ సాహితీసర్వస్వం పుస్తకావిష్కరణ

తులసీకృష్ణ, తులసి, పి రామకృష్ణ పేర్లతో సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించిన కడప జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత రామకృష్ణారెడ్డి పోసా గారి రచనలను అన్నిటినీ ఏర్చీ కూర్చీ వారి కుమారుడు సురేంద్ర (ప్రఖ్యాత కార్టూనిస్టు) ఒకే పుస్తకంగా తీసుకు వస్తున్నారు. ‘పి రామకృష్ణ రచనలు’ పేర వెలువడిన రెడ్డి గారి సాహితీ సర్వస్వం ఆవిష్కరణకు సిద్ధమైంది. 820 పుటలున్న ఈ పుస్తకంలో రామకృష్ణ గారి కథలు, కవితలు, నవలలు, వ్యాసాలు (కాలమ్స్ సహా) అన్నీ ఉన్నాయి. అన్వర్ గీసిన […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం రాజకీయాలు

సూక్ష్మ సేద్య రాయితీలలోనూ కడప, కర్నూలులపై ప్రభుత్వ వివక్ష

సూక్ష్మ సేద్య పరికరాల (స్ప్రింక్లర్లు, బిందు సేద్య పరికరాలు మొదలైనవి) కొనుగోలు సబ్సిడీ విషయంలోనూ కడప, కర్నూలు జిల్లాలపై తెదేపా ప్రభుత్వం వివక్ష చూపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సూక్ష్మసాగునీటి పథకం కింద వివిధ వర్గాల రైతులకు ప్రకటించిన సబ్సిడీల విషయంలో జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు జిల్లాలలో ఉన్న రైతులకు ఎక్కువ లబ్ది కలిగేలా ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబరు-34(https://kadapa.info/gos/go34/)ని విడుదల చేసింది. అదే సమయంలో రాయలసీమకే చెందినా కడప, కర్నూలు […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ ల్యాబూ పోయే!

DRDO వాళ్ళు ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ లాబ్ నెలకొల్పడానికి ఒకేచోట 3,400 ఎకరాలు అవసరమై, ఏరికోరి కడప నగర శివార్లలోని కొప్పర్తిలో భూమి కావాలని కోరితే (http://www.thehindu.com/news/cities/Vijayawada/electronic-warfare-lab-in-kadapa-district/article6398329.పూర్తి వివరాలు ...

వార్తలు

జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్ జయంతి

కడప: వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతిని బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైకాపా శ్రేణులు జిల్లా వ్యాప్తంగా విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్‌లో వైఎస్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ సతీమణి, వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కుమార్తె షర్మిల, కోడలు వైఎస్ భారతి, అల్లుడు అనిల్‌, మేనత్త కమలమ్మ, సొదరి విమలమ్మ, సోదరుడు సుధీకర్‌రెడ్డి, చిన్నాన్న వైఎస్ పురుషోత్తంరెడ్డి, బావ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, వదిన […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

12న అమెరికాలో రాయలసీమ వనభోజనాలు

జార్జియాలోని కమ్మింగ్ నగరంలో… నోరూరించే రాయలసీమ వంటకాలతో మెనూ.. (అమెరికా నుండి నరేష్ గువ్వా) జులై 12న ఆదివారం నాడు అమెరికాలోని కమ్మింగ్ నగరం (జార్జియా)లో రాయలసీమ వనభోజనాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వెస్ట్ బ్యాంక్ పార్కులో ఆదివారం ఉదయం  11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ రకాలైన రాయలసీమ వంటకాలను వడ్డిస్తారు. భోజనాల తర్వాత ఆట పాటల కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అమెరికాలో నివసిస్తున్న రాయలసీమ వాసులూ, తెలుగు […]పూర్తి వివరాలు ...

వార్తలు

వైఎస్సార్ క్రీడాపాఠశాలలో నాలుగో తరగతిలో ప్రవేశానికి ఎంపికలు

40 మంది విద్యార్థులకు ప్రవేశం కడప: జిల్లాలోని వైఎస్సార్ క్రీడాపాఠశాలలో ప్రవేశానికి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రత్యేకాధికారి రుద్రమూర్తి మంగళవారం వైఎస్సార్ క్రీడాపాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి నాల్గవ తరగతి ప్రవేశానికి 20 మంది బాలురు, 20 మంది బాలికలకు ఎంపిక చేయనున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల విద్యార్థులు ఈ ఎంపికల్లో పాల్గొనేందుకు అర్హులని చెప్పారు. ఎంపికల ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుందన్నారు. మండల స్థాయిలో ఎంఈవోలు, […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఉద్దేశపూర్వకంగా జిల్లాను ఘోరీ కడుతున్నారు

విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో శాసనసభ్యులు మౌనముద్ర దాల్చిన కలెక్టర్ కడప: జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు అవసరమని కమిటీ ఛైర్మన్, ఎంపీ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు, కేటాయింపులు, నిధుల వినియోగం, ప్రజలకు చేరువపై సమీక్షించడానికి బుధవారం సభాభవన్‌లో నిర్వహించిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కమిటీ ఛైర్మన్‌గా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి,  కార్యదర్శి హాదాలో జిల్లా కలెక్టర్ వెంకటరమణ, సభ్యులుగా జడ్పీ ఛైర్మన్ గూడూరు రవి, 8 […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

పెద్దదర్గాను దర్శించుకున్న కథానాయకుడు ఆదిత్య ఓం

కడప: వర్థమాన కథానాయకుడు ఆదిత్య ఓం సోమవారం అమీన్ పీర్ దర్గాను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. గురువులకు పూల చాదర్ సమర్పించి ప్రార్థనలు చేశారు. దర్గా ప్రతినిధులను అడిగి గురువుల గొప్పదనాన్ని, దర్గా మహత్యాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చాలా రోజుల నుంచి దర్గాను దర్శించాలనుకునే కోరిక నేటికి నెరవేరిందన్నారు.పూర్తి వివరాలు ...

వార్తలు

26నుంచి యోవేవి పీజీ కౌన్సిలింగ్

కడప: యోగివేమన విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశాల కోసం అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 26 నుంచి కౌన్సెలింగ్ జరుగుతుంది. ఈ మేరకు విశ్వవిద్యాలయ  సంచాలకులు ఆచార్య రఘునాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ కేంద్ర గ్రంథాలయంలో ఉదయం 9 గంటలకు అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. 26న ఉదయం ఉదయం బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్, మైక్రో బయాలజీ సబ్జెక్టులకు, మధ్యాహ్నం 2 గంటలకు పొలిటికల్ సైన్సు అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం, […]పూర్తి వివరాలు ...