వార్తా విభాగం

వార్తలు

ప్రభుత్వ తీరుకు నిరసనగా 7న విద్యాసంస్థల బంద్

కడప: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నందుకు నిరసనగా ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, పీడీఎస్‌వి ఆధ్వర్యంలో ఆగస్టు7న (శుక్రవారం) విద్యాసంస్థల బంద్‌కు ఆయా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు విద్యార్థులు, విద్యాసంస్థలు సహకరించాలని వారు కోరారు. మంగళవారం స్థానిక ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి కార్పొరేట్ శక్తుల మోజులోపడి విద్యారంగ సమస్యలను పక్కనపెట్టారన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రీఇంబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

కడప పెద్దదర్గాలో ‘అల్లరి’ నరేష్

కడప: కథానాయకుడు ‘అల్లరి’ నరేష్ ఈ రోజు (ఆదివారం) కడప నగరంలోని ప్రఖ్యాత అమీన్‌పీర్ దర్గాను దర్శించుకున్నారు. నరేష్ పూల చాదర్‌లను దర్గాలోని ప్రధాన గురువుల మజార్ల వద్ద సమర్పించి ప్రార్థనలు చేశారు. అనంతరం నరేష్ విలేఖరులతో మాట్లాడుతూ.. చాలా కాలం నుంచి పెద్ద దర్గాకు రావాలని ప్రయత్నించినా వీలు కాలేదన్నారు. ప్రస్తుతం తాను నటించిన ‘జేమ్స్‌బాండ్’ సినిమా విజయవంతం కావడంతో దర్గా గురువుల ఆశీస్సుల కోసం వచ్చానన్నారు. జేమ్స్‌బాండ్‌చిత్రంలో ‘సీమ’ సంప్రదాయాన్ని కించపరిచిన సందర్భాన్ని విలేకరులు ఆయన […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు రాయలసీమ

కడప జిల్లాపై ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోంది: గేయానంద్

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాఉద్యమం సీమ ప్రజలంతా పోరుబాటకు సిద్ధం కావాల ప్రొద్దుటూరు: కడప జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం అలవికాని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ, తీవ్ర వివక్ష చూపుతోందని శాసనమండలి సభ్యుడు డాక్టరుఎం.గేయానంద్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రొద్దుటూరులో ఒక ఆసుపత్రిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ… రాయలసీమకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినహామీలు ఇంతవరకు అమలు కాలేదన్నారు. నదీజలాల పంపకంలో రాయలసీమకు అన్యాయం జరిగిందన్నారు. రాయలసీమ అభివృద్ది విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాఉద్యమం చేస్తామని హెచ్చరించారు.వెనకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం ప్రజలంతా పోరుబాటకు సిద్ధం […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు రాయలసీమ

అమెరికాలో సీమ వనభోజనాలకు 500 మంది

(అమెరికా నుండి నరేష్ గువ్వా) జులై 12న ఆదివారం నాడు అమెరికాలోని కమ్మింగ్ నగరం (జార్జియా)లో నిరాహించిన రాయలసీమ వనభోజనాలు కార్యక్రమం విజయవంతమైంది.  వెస్ట్ బ్యాంక్ పార్కులో ఆదివారం ఉదయం  11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది ప్రవాసాంధ్రులు హాజరై సీమ రుచులను ఆస్వాదించారు. వనభోజనాలలో రాగిసంగటి, కోడి పులుసు (chicken gravy), పొట్టేలు సియ్యల పులుసు (Goat Curry), శనిక్కాయ కారెం (Ground nut […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

ప్రత్యేక రాయలసీమ కోసం మళ్లీ ఉద్యమించాల్సిన సమయమొచ్చింది : డిఎల్

బాబు సీమపైన వివక్ష చూపుతున్నారు ఇలాంటి కలెక్టర్ను ఎప్పుడూ చూడలేదు ప్రొద్దుటూరు: నేటి సమకాలీన రాజకీయ పరిమణాలు దృష్ట్యా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు కోసం మళ్లీ ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని లేకపోతే రాయలసీమ జిల్లాలకు మనుగడ ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్.రవీంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…రాయలసీమలో పుట్టిన చంద్రబాబు ఈ ప్రాంతం పైన వివక్ష చూపడం దారుణమన్నారు. రాయలసీమ పరిధిలోనే […]పూర్తి వివరాలు ...

చరిత్ర ప్రసిద్ధులు

వైఎస్ హయాంలో కడపకు దక్కినవి

వైఎస్ హయాంలో కడప అభివృద్ధి వైఎస్‌గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. విధి నిర్వహణలో ఉండగానే అసువులు బాసిన వైఎస్ తన అయిదేళ్ళ పరిపాలనా కాలంలో కడప జిల్లాకు మంజూరు చేసిన/చేయించిన కొన్ని అభివృద్ది పనులు ఇవే… విద్యారంగం: యోగివేమన విశ్వవిద్యాలయం సిపిబ్రౌన్ భాషాపరిశోధనా కేంద్రానికి ఏటా ౩౦ లక్షల రూపాయల […]పూర్తి వివరాలు ...

చరిత్ర పల్లెలు

ముస్లింల పేర్లు కలిగిన ఊర్లు

కడప జిల్లాకు ఇస్లాం మత సంపర్కం 14వ శతాబ్దిలో జరిగినట్లు ఆధారాలున్నాయి (APDGC, 143). కుతుబ్ షాహీ, మొగల్, మయాణా, అసఫ్ జాహీ, హైదర్ అలీ, టిప్పు సుల్తాను ప్రభువుల పరిపాలనా కాలాల్లో ఇస్లాం మతం, జాతుల వ్యాప్తీ, ఉర్దూ భాషా వ్యాప్తం జరిగినాయి. (కడప జిల్లాలో మహమ్మదీయ రాజ్య స్థాపన వివరాలకు చూడండి Ibid 100-113). 1961 జనాభా లెక్కల ప్రకారం కడప జిల్లాలో 1,87,945 మంది మహమ్మదీయులు ఉన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం […]పూర్తి వివరాలు ...

ప్రసిద్ధులు

పి రామకృష్ణ

ఆధునిక సాహిత్యకారులకు చిరపరిచితమైన పేరు రామకృష్ణారెడ్డి పోసా. నిశితంగా రచన చేయడంలో నేర్పరి. వీరి మొదటి కథ ‘వెనుకబడిన ప్రయాణికుడు’ 1965 జులైలో జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది. కడప మాండలికంలో వీరు రాసిన ‘పెన్నేటి కథలు’ ఆంధ్రజ్యోతి వారపత్రికలో వరుసగా ప్రచురితమయ్యాయి. విద్వాన్ విశ్వం ‘పెన్నేటి పాట’ గేయకావ్యం తర్వాత అంతే పదునుగా, స్పష్టంగా రాయలసీమ జనజీవన చిత్రాన్ని రూపుకట్టి చూపించిన కథలు రామకృష్ణారెడ్డి గారి ‘పెన్నేటి కతలు’. పెన్నేటి ఒడ్డున ఒక గ్రామంలోని జీవన శకలాలను ఒక్కో […]పూర్తి వివరాలు ...

వార్తలు

‘కొప్పర్తి పరిశ్రమలవాడలో భూముల ధరలు ఎక్కువ’: కలెక్టర్

గతంలో ఏ కలెక్టరు ఇలా ఉండరనేది నిజమే కడప :  కొప్పర్తి పరిశ్రమల పార్కులో పెద్ద, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు అక్కడ భూముల ధరలు ఎక్కువగా ఉన్నందువల్ల వెనక్కి తగ్గుతున్నారని జిల్లా కలెక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. కడప జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాదైన సందర్భంగా సోమవారం స్థానిక సభాభవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఆయన మాట్లాడుతూ గతంలో ఏ కలెక్టరు ఇలా ఉండరనేది నిజమేనన్నారు. అప్పటి […]పూర్తి వివరాలు ...