వార్తా విభాగం

రాజకీయాలు

పువ్వు పార్టీలో చేరిన ఆదినారాయణ

కడప : మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి సోమవారం ఢిల్లీలో బీజేపీ పార్టీలో చేరినారు. ఆ పార్టీ జాతీయ నాయకుల చేతుల మీదుగా ఆది ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.  వైఎస్‌ అధికారంలో ఉన్నంతకాలం ఆది కాంగ్రెస్ లో ఉన్నారు. 2014లో వైకాపా తరపున శాసనసభ్యునిగా గెలిచిన ఆది పార్టీ ఫిరాయించి తెదేపాలో చేరి మంత్రి పదవి పొందారు. అధికారం పోయాక ఇప్పుడు సైకిల్ పార్టీని వదిలిపెట్టి పువ్వు పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా […]పూర్తి వివరాలు ...

సామెతలు

కడప సామెతలు – ‘ఇ’తో మొదలయ్యేవి

‘ఇ’తో మొదలయ్యే కడప సామెతలు … ‘ఇ ‘ అనే అక్షరంతో తెలుగు సామెతలు. కడప జిల్లాతో పాటుగా రాయలసీమ నాలుగు జిల్లాలలో వాడుకలో ఉన్న/ఉండిన సామెతలు. ఇంటి ఎద్దుకు బాడుగ ఇంటికన్న గుడి పదిలం ఇంటికో కడిదిని గుంటగ్గుక్కనీల్ దాగినట్టు ఇంతే సంగతులు చిత్తచ్చవలయును ఇచిత్రానికి ఇద్దురు పుడితే ఈడ్చలేక ఇద్దరు సచ్చిరంట ఇచిత్రానికి ఈర్లు బెడితే ఇంటాదికి యారగబెట్నంట ఇచ్చేటోడు ఉంటే సెచ్చోటోడు లేసొచ్చినంట ఇచ్చేవోన్ని సూసి చ్చేవోడుకూడా లేసొచ్చ ఇట్లిట్లే రమ్మంటే ఇల్లంతా […]పూర్తి వివరాలు ...

కవితలు

నేను – తను (కవిత) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

ఒక అభిప్రాయం మా మధ్య పెఠిల్లున విరిగినపుడు మేమిద్దరం చెరో ధృవం వైపు విసరేయబడతాము ఆమె మొహం నాకేదో నిషిద్ధ వర్ణ చిత్రంలా గోచరిస్తుంది చేయి చాచితే అందే ఆమె దూరం మనస్సులో యోజనాలై విస్తరించుకొంటుంది ఉల్లిపొరై మామధ్య లేచిన భేదభావానికి నా అహం ఉక్కుపూత పూసేందుకు నడుం బిగిస్తుంది మౌనంగా మామధ్య చెలియలికట్టలా పడుకొని వున్న పాపకు ఇటువైపు నా గుండె కల్లోల సాగరమై ఎగిసి పడుతుంటుంది నా మనస్సు విరిగిన అభిప్రాయ శకలాల్ని కూర్చుకొంటూ […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

కవయిత్రి మొల్ల – మా ఊరు

చిన్నతనంలో అమ్మ పిన్ని అత్త ముగ్గురూ రొకళ్ళతో వడ్లు దంచుతూవుంటే ఒకామె ముగ్గురి రొకటిపోట్లు చాకచక్యంగా తప్పించుకుంటూ రోట్లోకి వడ్లు ఎగతోసేది. ఆమె అలా రోట్లోకి వడ్లు ఎగదోస్తూనే తమ రైతు స్త్రీలకు కష్టం తెలియకుండా రామాయణం మొత్తంపాడి వినిపించేది. నాకప్పుడు తెలియదు అవి స్త్రీలరామాయణపు పాటలని. దంచిన వడ్లు చాటలతో చెరిగి బియ్యం, నూక, తవుడు, ఊక వేరువేరు చేసేసరికి శ్రీరాములవారి పట్టాభిషేకం పూర్తయిపోయ్యేది. మళ్లీ వడ్లు దంచేరోజు ఎప్పుడొస్తుందోనని ఎదురుచూసేవాణ్ని , ఆయమ్మనోట రాములవారి […]పూర్తి వివరాలు ...

వార్తలు

అక్టోబరు 30 నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు : యోవేవి

కడప : అక్టోబరు 30 నుంచి యోవేవి అనుబంధ కళాశాలలలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం కోర్సులు చదువుతున్న విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 40 వేల మంది విద్యార్థులు సెమిస్టర్‌ పరీక్షలకు హాజరుకానున్నారు. 30న ప్రారంభమై నవంబరు 21 వరకు సెమిస్టర్‌  పరీక్షలు జరుగుతాయి.పూర్తి వివరాలు ...

వార్తలు

కడప ఎస్పీగా అన్బురాజన్‌

కడప : వైఎస్సార్‌ జిల్లాకు కొత్త ఎస్పీగా నియమితులయిన అన్బురాజన్‌ శుక్రవారం కడపలో విధుల్లో చేరారు. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన అభిషేక్‌ మొహంతి సుదీర్ఘ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో అన్బురాజన్‌ ఎస్పీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత కేసులను పరిశీలించి వాటి పురోగతిపై దృష్టి పెడతానని పేర్కొన్నారు. నగరంలోని ట్రాఫిక్‌పై దృష్టి సారిస్తానని, సమస్య ఏదైనా నిర్భయంగా తన దగ్గరకు రావచ్చని తెలిపారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో మరింత మెరుగైన టెక్నాలజీని ఉపయోగించి […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం వ్యాసాలు

ఈ రాయలసీమ చీకటి ఖండం – పుట్టపర్తి వారి తొలిపలుకు

ఇప్పటికి శివతాండవం పదిసార్లైనా ప్రింటు అయివుంటుంది. కానీ నేను ఆర్ధికంగా లాభపడింది మాత్రం చాలా తక్కువ. కారణాలు అనేకాలు. ముఖ్యంగా ఈ రాయలసీమ చీకటి ఖండం. ఈ ప్రాంతాల్లోనే గడ్డకు వచ్చి ఒక పేరు, ప్రతిష్ట సంపాదించుకోవలంటే చాలా కష్టం. సాహిత్యకంగా నా జీవితంలో ఎన్నో కల్లోలాలు ఎదుర్కోవలసివచ్చింది. ఒకసారి గుంటూరికి సాహిత్య మిత్రులు కొందరు నన్నాహ్వానించినారు. నాకు శరీర ఆరోగ్యము కూడా సరిగాలేదు అప్పుడు. ప్రయాణినికి కావలసిన జాగ్రత్తలన్నీ వారే చూచుకున్నారు. రామాయణం పైన నా […]పూర్తి వివరాలు ...

వార్తలు

వజ్రాల గని ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ

కడప : ముద్దనూరు మండలంలోని చింతకుంట సమీపంలో శుక్రవారం అధికారులు వజ్రాల గని ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఊరికి సమీపంలోని కొండ ప్రాంతంలో 45.649 హెక్టార్లలో వజ్రాల ముడి ఖనిజం (క్వార్ట్జ్‌) గనుల ఏర్పాటుకు షేక్‌ అల్లాహ్‌ మహమ్మద్‌ భక్షి అనే మైనింగ్ వ్యాపారి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ.. గనులలో స్థానికులకు ఉపాధి కల్పించాలన్నారు. మైనింగ్‌ కాస్ట్‌లో 2 శాతం ఊరి […]పూర్తి వివరాలు ...

వార్తలు

ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్టు శ్రీనాథ్‌రెడ్డి

కడప : సీనియర్ జర్నలిస్టు, కడప జిల్లాకు చెందిన దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. శ్రీనాథ్‌రెడ్డి సుదీర్ఘ కాలం 28 సంవత్సరాల పాటు ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలలో సీనియర్ జర్నలిస్టుగా పని చేశారు. 2014 నుంచి సాక్షి పొలిటికల్ సెల్‌కు సలహాదారులుగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీయు డబ్ల్యుజేలో వివిధ హోదాల్లో పని చేశారు. రాయలసీమ ఉద్యమంలో కీలకంగా పని […]పూర్తి వివరాలు ...