
మైదుకూరులో ఎవరికెన్ని ఓట్లు?
మైదుకూరు శాసనసభ స్థానానికి గాను మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 12 మంది అభ్యర్థులు తుది పోరులో నిలుచున్నారు. ఈ పోరులో వైకపా తరపున బరిలోకి దిగిన శెట్టిపల్లి రఘురామిరెడ్డి తన సమీప ప్రత్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ పై గెలుపొందారు.
మైదుకూరు నియోజకవర్గం నుండి తుదిపోరులో తలపడిన 12 మంది అభ్యర్థులకు లభించిన ఓట్ల వివరాలు…
రఘురామిరెడ్డి శెట్టిపల్లి – వైకాపా – 85539
పుట్టా సుధాకర్ యాదవ్ – తెదేపా – 74017
కోటయ్యగారి మల్లిఖార్జునమూర్తి – కాంగ్రెస్ – 991
డి ఆంజనేయులు – వైప్రపా – 948
ఎం జెర్మియా – బసపా – 725
డి జనార్ధన్ రెడ్డి – నేకాపా – 512
వెనుతుర్ల రవిశంకర్ రెడ్డి – జైసపా – 428
చిలుంగారి చిన్న పుల్లయ్య – ఆమ్ ఆద్మీ – 222
బొమ్ము వీరనారాయణరెడ్డి – స్వతంత్ర అభ్యర్థి (పండ్ల బుట్ట) – 195
ఎస్ రామప్రతాప్ రెడ్డి – స్వతంత్ర అభ్యర్థి (బ్యాట్ ) – 174
కె జయన్న – స్వతంత్ర అభ్యర్థి (టెలిఫోన్) – 140
పి బాలయ్య యాదవ్ – స్వతంత్ర అభ్యర్థి (అల్మారా) – 122
నోటా – 58