పెద్దదర్గా ఉరుసు ప్రారంభం

పెద్దదర్గా ఉరుసు ప్రారంభం

కడప: నగరంలోని అమీన్ పీర్ (పెద్ద) దర్గాలో హజరత్ సూఫిసర్ మస్త్‌షా చిల్లాకష్ ఖ్యాజా సయ్యద్ షా ఆరీఫుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్టిపుల్ ఖాదిరి ఉరుసు ఉత్సవాలు కొద్ది సేపటి క్రితం ఘనంగా ప్రారంభం అయ్యాయి. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మలంగ్‌షాను పీరి మీద పీఠాధిపతి ఆసీనులు చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం కళకళలాడింది.

ఉత్సవాలలో భాగంగా శనివారం ప్రస్తుత పీఠాధిపతి రాత్రి 10 గంటలకు గంధం సమర్పించి ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆదివారం ఉరుసు మహోత్సవం, సోమవారం జాతీయస్థాయి 71వ ముషాయిరా (కవి సమ్మేళనం) ఉంటుంది.

చదవండి :  'చంద్రబాబు మాట నిలుపుకోవాల'

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *