ఈ పొద్దు నుంచి శ్రీ నారాపుర వేంకటేశ్వరుని పవిత్రోత్సవాలు

ఈ పొద్దు నుంచి శ్రీ నారాపుర వేంకటేశ్వరుని పవిత్రోత్సవాలు

తితిదే పరిధిలోని వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బుధవారం నుంచి ఈ నెల 5వతేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి.

ఇందులో భాగంగా బుధవారం ఉదయం 9 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం, యాగశాల పూజ, పుణ్యావచనం, పవిత్ర ప్రతిష్ట నిర్వహిస్తారు. 4వతేదీన ఉదయం 8.30 నుండి 12 గంటల వరకు పవిత్ర సమర్పణ, 5వతేదీన ఉదయం 8.30 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం, మహాపూర్ణాహుతి, సాయంత్రం 6 నుండి 8.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల తిరువీధి ఉత్సవం జరగనుంది.

చదవండి :  జమ్మలమడుగు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *