15న జిల్లాకు చిన’బాబు’

15న జిల్లాకు చిన’బాబు’

రాజంపేట: ముఖ్యమంతి చంద్రబాబు కొడుకు, చినబాబుగా తెదేపా శ్రేణులు పిలుచుకొనే నారా లోకేష్ ఈనెల 15న జిల్లాకు వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఆదివారం అధికారికంగా తెలియచేశారు.

బుధవారం ఉదయం 9 గంటలకు నారా లోకేష్ రాజంపేటకు చేరుకుని పాతబస్సుస్టాండు బైపాస్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారని తెలిపారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండు వరకూ నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొంటారన్నారు.

అనంతరం ఒంటిమిట్ట కోదండరామస్వామిని దర్శించుకుని, కడప మీదుగా పులివెందులకు వెళుతారని చెప్పారు.

చదవండి :  పులివెందుల గురించి చంద్రబాబు అవాకులు చెవాకులు

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *