ఏప్రిల్ 27న కడపకు రానున్న మీరాకుమార్

    ఏప్రిల్ 27న కడపకు రానున్న మీరాకుమార్

    కడప కలెక్టరేట్ బంగ్లా కూడలిలో ప్రతిష్ఠించిన బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏప్రిల్ 27వ తేదిన లోక్సభ స్పీకర్ మీరాకుమార్ కడపకు రానున్నారు.ఈ  మేరకు శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో మీరాకుమార్‌ను కలిసిన దళిత నాయకులకు ఆమె అంగీకారం తెలిపారు.

    27వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీ నుంచి తిరుపతికి చేరుకుంటారు. అక్కడ భోజనాలను ముగించుకుని కడపకు బయలుదేరుతారు. 3-4 గంటల్లోగా కడపలో జరిగే జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. స్పీకర్‌ను కలిసిన వారిలో బాబూ జగ్జీవన్‌రామ్ ఆలిండియా సమతా మూమెంట్ రాష్ట్ర అధ్యక్షులు ఆనందబాబు, జిల్లా అధ్యక్షుడు రెడ్డెన్న, విగ్రహావిష్కరణ ఆహ్వాన కమిటీ చైర్మన్ జయచంద్ర, సభ్యులు గరుడాద్రి, గంగన్న, సుబ్బయ్య, ఓబులేశు, గంగులు, ఆంజనేయులు, మల్లేష్ తదితరులు ఉన్నారు.

    చదవండి :  కరువుసీమలో నీళ్ళ చెట్లు!

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *