ఎండాకాలమొచ్చింది!

కడప జిల్లా ఉష్ణోగ్రతల సూచీ – మార్చి నెల

ఎండాకాలమొచ్చింది!

గాలిలో తేమ శాతం క్రమేపీ తగ్గుతుండడంతో జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. శనివారం కడపలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజు గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ నివేదికలు తెలియచేస్తున్నాయి.

మార్చి ఒకటవ తేదీ నుండి జిల్లావ్యాప్తంగా క్రమేపీ  ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. మార్చిర్చి ౩1వ తేదీ నాటికి ఉష్ణోగ్రత గరిష్టంగా 43 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా జిల్లా వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఉక్కపోత జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీనికితోడు కరెంటు కోతలతో జనాలు అవస్థలు పడుతున్నారు. కడప నగరంలో మధ్యాహ్నం సమయంలో ఎండల కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

చదవండి :  వైభవంగా గంధోత్సవం - తరలివచ్చిన సినీ ప్రముఖులు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *