వార్తా విభాగం

వ్యాసాలు

సమాజం అంతగా పతనమైందా? – రారా

(నవంబరు 24 రారా వర్ధంతి సందర్భంగా…) దిగంబర కవుల మూడవ సంపుటి మీద రారా సమీక్ష వీళ్ళు ఆరుమంది__అరిషడ్వర్గంలాగా. అందరికీ మారుపేర్లు వున్నాయి. తాము దిగంబర కవులమనీ, తాము రాసేది దిక్‌లు అనీ వీళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళ మొదటి సంపుటి 1965 మేలోనూ, రెండవ సంపుటి 66 డిసెంబర్‌లోనూ వచ్చినాయి. 68 సెప్టెంబర్లో మూడవ సంపుటి వచ్చింది. 120 పేజీలు గల యీ సంపుటిలో దిక్‌లు చాలానే వున్నాయి. కవిత్వం మాత్రం యెక్కడా లేదు. కవి ఒక […]పూర్తి వివరాలు ...

కథలు

కరువు (కథ) – నూకా రాంప్రసాద్

నూకా రాంప్రసాద్ కథ ‘కరువు’ ఆ మేఘానికి మేమంటే ఎందుకంత చిన్నచూపో? నీళ్లో రామచంద్రా అని మేమల్లాడుతుంటే ఒక పక్క ఉధృతంగా వానలు కురిసి వరదలొస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే మేఘం గిరిగీసుకుని వర్షిస్తోందని పెద్ద అనుమానం. ఈ సంవత్సరం కూడా నైరుతీ బుతుపవనాలు మోసం చేశాయి. అదనుకు పదును పడే సూచనలు కన్పించడం లేదు. రైతుల బతుకుల్లో ప్రతికూల పవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశకు విస్తరించే తుఫాన్లుగా మారాయి. “ఏందిరా సంటోడా, ఆలోశ్యన్లో పడ్న్యావ్‌ […]పూర్తి వివరాలు ...

కథలు

శని (కథ) – సొదుం జయరాం

సొదుం జయరాం కథ ‘శని’ “ఏం చేస్తున్నావురా,కేశవా? ” అంటూ ఆదిరెడ్డి యింట్లోకి వచ్చాడు. కేశవ భోంచేసి, కునుకు తీసే ప్రయత్నంలో వున్నాడు. అదిరెడ్డిని చూడగానే మంచం మాద నుంచి చివుక్కున లేచి నిలబడి : “కూర్చో పెదనాన్నా” అన్నాడు. ఆదిరెడ్డి ఉసూరుమంటూ మంచం మాద కూలబడి, “ఎండలు దంచేస్తున్నాయిరా కేశవా” అన్నాడు. “మార్చిగదా, యిప్పుడే ఎండలు మొదలయ్యాయి”. “అది సరే సావిత్రి కనిపించదేం?” అన్నాడు ఆదిరెడ్డి. “ఇంట్లో భోంచేస్తోంది” కేశవ అన్నాడు. ఇంట్లో భోంచేస్తున్న సావిత్రి […]పూర్తి వివరాలు ...

కథలు

సీమ బొగ్గులు (కథ) – దేవిరెడ్డి వెంకటరెడ్డి

దేవిరెడ్డి వెంకటరెడ్డి రాసిన ‘సీమ బొగ్గులు’ కథ రోడ్డు మొగదాలున్న చేన్లోకి దిగీ దిగకముందే అశోకుడి పయి జలదరించింది. తిన్నగ అడుగులేస్తూ ఎప్పటిలాగా వేరుసెనగ పైరు వైపు తేరిపార చూశాడు. పచ్చదనం పావలాభాగం లేదు. ఎండకు మాడిన ఆకులు. అక్కడక్కడ అవి రాలిపోగా మిగిలిన ఒట్టి పుల్లలు. మూడో చోట మరోచెట్టు పెరికి మట్టి విదల్చాక కళ్ళు చెమ్మగిల్లాయి. చెట్టుకు రెండు తప్పితే మూడుకాయలు. అందులో ఒకటీ అరా లొట్టలు. ఐదెక రాల ఖర్చూ, గుత్తా వెరసి […]పూర్తి వివరాలు ...

కథలు

చనుబాలు (కథ) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

చీకటి చిక్కబడింది. బలహీనంగా వెలిగే వీధిలైట్ల కాంతిలో వేపచెట్టు కింది అరుగుమీద మరింత దట్టమైన చీకట్లో నా చుట్టూ ఐదారు బీడీ ముక్కలు మినుకు మినుకుమంటున్నాయి. వాటి నిప్పు, వెలుగు అరుగు ముందు నిల్బున్న నాలుగైదు జతల కనుపాపల మీద ప్రతిఫలిస్తోంది. “మాదా కవలం తల్లీ! సందాకవలమమ్మా!” అంటూ బిక్షగత్తెలు ఇల్లిల్లూ తిరిగి గొంతెత్తే వేడికోళ్లు ఇక్కడిదాకా పాకుతున్నాయి. తెగులు చూపిన కోళ్లను అగ్గవగా ఎదరకపోతున్న బేరగాళ్లు వాటి కాళ్లకు తాళ్లు గట్టి సైకిలు మీద వేలాడేసుకు […]పూర్తి వివరాలు ...

కథలు

మనువు (కథ) – సొదుం జయరాం

సొదుం జయరాం కథ ‘మనువు’ ఆ ఇంట్లో పీనుగ లేచినంతగా విషాద వాతావరణం అలుముకుంది. నిజానికి ఆ ఇంట్లో అంతగా బాధపడవలసిన ఘోరవిపత్తు ఏదీ ముంచుకు రాలేదు. ఆ ఇంటి పెద్దమ్మాయి విమల లేచిపోయింది. ఆ ఇంటిల్లిపాదీ బాధకు కారణం అదీ. దానికి రోగమో రొస్టో వచ్చి చచ్చిపోయి ఉంటే నాలుగు రోజులు ఏడ్చి ఊరుకొనేవాళ్లం. పరువు ప్రతిష్టలు గంగలో కలిపి పాడుపని చేసి చచ్చింది.” అంటూ విమల చెల్లెలు సుధ ఉదయం నుంచీ వెక్కి వెక్కి […]పూర్తి వివరాలు ...

కథలు

ఇచ్ఛాగ్ని (కథ) – కేతు విశ్వనాథరెడ్డి

పెద్దకూతురు హరిత పుట్టిల్లు చేరి మూడు మాసాలు దాటింది. ‘తరాలు మారాయి సంస్కారాల మధ్య ఘర్షణలు ఎక్కువయ్యాయి. సామరస్యానికి మార్గమేమిటో ఏ రకంగా కుదురుతుందో అది?” అని హరిత తల్లి కస్తూరి తల్లడిల్లింది. సంస్కారం కొలిమిలో కాల్చటానికి తన కూతురు ఇనుమూకాదు, ఇత్తడీ కాదు, మనిషి రక్తమాంసాలున్న మనిషి. వాడి పీహెచ్‌.డి. చదువూ, ఆ యూనివర్శిటీ లెక్చరరు ఉద్యోగమూ తగలెయ్యనా? అని హరిత తండ్రి లెనిన్‌ బాబుకు ఆగ్రహం కలిగింది. తల్లిదండ్రుల తల్లడిల్లడాలూ, ఆగ్రహాలూ కాపురాల్ని సంధించలేవు. […]పూర్తి వివరాలు ...

కథలు

కసాయి కరువు (కథ) – చక్రవేణు

చక్రవేణు కథ ‘కసాయి కరువు’ రాళ్లసీమ పల్లె మీద ఎర్రటి ఎండ నిప్పులు కురిసినట్లు కురుస్తోంది. ఎందుకో నూరీడు వగపట్టినట్లు ఊరి మీద అగ్గి వాన చల్లుతున్నాడు. తూరువు కొండ మీద చెట్లు మలమల మాడి ఎండిపోయాయి. గుట్టల మీద తెల్లకనిక రాళ్ళు కొలిమిలో మండినట్లు ఎర్రగా మెరున్తున్నాయి. యుద్ధకాలంలో శత్రువుల దాడికి భయవడి ఊరొదిలి వలనపోయిన విధంగా వల్లె పల్లె అంతా. బోసిగా ఉంది. పల్లెలో ఇళ్ళ యజమనులెవ్వరూ లేరు. పసిబిడ్డలూ, వాళ్ళ తల్లులూ, మునలోళ్ళూ […]పూర్తి వివరాలు ...

Uncategorized

తెలుగుదేశం కూటమికి అభినందనలు

ఎన్నికల సమరంలో వైఎస్ కుటుంబానికి కంచుకోటగా పేరొందిన కడప జిల్లాను తెలుగుదేశం దాని మిత్రపక్షాలు కలిసి చేధించాయి. పాత కడప జిల్లాలోని పులివెందుల, రాజంపేట మరియు బద్వేలు నియోజకవర్గాలు కాకుండా మిగిలిన అన్ని నియోజకవర్గాలలో దేశం కూటమి జెండా పాతింది. కంచుకోటలా నిలబడిన జిల్లాను కూటమి ఎలా ఛేదించగలిగింది అంటే అందుకు అనేక కారణాలు కనబడతాయి.పూర్తి వివరాలు ...