జానపద కళాకారుడు మునెయ్య వర్ధంతి

కలిమిశెట్టి మునెయ్య

జానపద కళాకారుడు మునెయ్య వర్ధంతి

తెలుగునేలపై జానపదబ్రహ్మగా ఖ్యాతి పొందిన మునెయ్య వాడవాడలా తిరిగి సేకరించిన జానపదగేయాలు వేనవేలు. ఔత్సాహిక కలాకారులెందరికో స్పూర్తి ప్రదాత. మునెయ్య కేవలం గాయకులే కాక మంచి రచయిత, చిత్రకారులు. వీరపునాయునిపల్లె శ్రీ సంగమేశ్వర ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా పనిచేశారు.

1943 సంవత్సరంలో కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకా దొమ్మరనంద్యాలలో జన్మించారు మునెయ్య.

చారిత్రక సత్యాలు ప్రతిబింభించే బుడ్డా వెంగళరెడ్డి, గురిగింజ గుమ్మడి, కోడిపిల్ల, కోడిబాయ లచ్చమ్మది, యాపమానెక్కినావు, తేలుకుట్టిందే పిన్ని, నాంచారి, నామాట, కోల్ కోల్, చీరెల్, తుమ్మెదలు మొదలైన హాస్య గీతాలు ఆయన వినిపించినప్పుడు శ్రోతలు మరియు ప్రేక్షకుల మదిలో గిలిగింతలు కలిగిస్తాయి.

శ్రామికులు పర్వదినంగా జరుపుకునే ‘మేడే’ వేడుకలలో శ్రామికుల ముందు తన గళాన్ని విప్పడానికి తన బృందంతో 1.5.1997 న మంత్రాలయంలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తూ కోడుమూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కానరాని తీరాలకు వెళ్ళిపోయారు.

‘రాయలసీమ రాగాలు’ పేర సీమ జానపదాలను మునెయ్య సంకలనం చేశారు. ఈ పుస్తకాన్ని ‘తెలుగు అకాడమీ’ ప్రచురించింది.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *