Search Results for: వనిపెంట

కైఫియత్తులు

వాల్మీకి మహాముని ఆశ్రమం అని చెప్పుకోబడిన స్తలమందు వనిపెంట

రాయించినది: కుల్కరిణీ శంకరప్ప నల్లమల పర్వతమందు ఉన్న అహోబిల నారసింహ క్షేత్రానికి దక్షిణ భాగమున యోజన ద్వయ స్థలమున పూర్వము వాల్మీకి తపస్సు చేస్తూ ఉండేవాడు. అందువలన ఈ స్థలమును వాల్మీకి పురం అని ప్రజలు చెప్పుకుంటున్నారు… ఇటు తరువాత చోళ మహారాజు రాజ్యం చేసేటప్పుడు (కలియుగమందు కొంత కాలం జరిగిన తరువాత) నర్ర గొల్లలు అనే వాళ్ళు ఈ స్థలములో నర్రవుల మందలు ఆపు చేసుకుని ఉండేవారు. అప్పుడు వాళ్ళు ఉండేటందుకు () గాను  కొట్టాలు […]పూర్తి వివరాలు ...

పర్యాటకం ప్రత్యేక వార్తలు వ్యాసాలు

మైదుకూరు సదానందమఠం

మైదుకూరు పట్టణంలోని పోరుమామిళ్ళ రోడ్డులో కె.సి.కెనాల్‌ పక్కగా వెలసిన శ్రీ సదానంద ఆశ్రమానికి (సదానందమఠం) మైదుకూరు చరిత్రలో విశిష్టమైన స్థానం ఉంది. “పిచ్చమాంబ మఠం” “పిచ్చమ్మ మఠం” పేర్లతో ఈ ఆశ్రమం పిలువబడుతోంది. మైదుకూరు మండలం వనిపెంటలోని ఓ మరాఠీ కుటుంబంలో జన్మించిన పెద్దయార్యులు మొదటగా సదానందశ్రమాన్ని స్థాపించి ప్రజల్లో తాత్విక చింతన, ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడానికి శ్రీకారం చుట్టారు. తండ్రి పెద్దయార్యుల భోధనలతో పిచ్చమాంబ ప్రభావితురాలైయ్యారు . ఆశ్రమం మరింతగా అభివృద్దిచెందడానికి విశేష కృషి చేశారు. […]పూర్తి వివరాలు ...

రహదారులు సమాచారం

కడప జిల్లాలోని జాతీయ రహదారులు

జాతీయ రహదారులకు గతంలో ప్రాధాన్యతా క్రమంలో ఇస్తూ వచ్చిన నంబర్లలో ఏవో కొన్ని ప్రధానమైన జాతీయ రహదారుల నంబర్లు తప్ప మిగతావి కొంత గందరగోళంగా తయారయ్యాయనే చెప్పాలి. ఏదైనా ఒక జాతీయ రహదారిని తీసుకుని దానితో కలుస్తున్న లేదా దాన్నుంచి విడిపోయిన ఇతర జాతీయ రహదారుల నంబర్లేమిటని చూస్తే చాలా సందర్భాలలో అవి ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండేవి. అందువల్ల గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమయ్యేది. దాంతో పదేండ్ల కిందట 2010లో రోడ్డు రవాణా & జాతీయ రహదారుల […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

చౌదరి సార్ ఇకలేరు

చౌదరి సార్ గా ప్రజలతో పిలువబడే డాక్టర్ పి.ఎ.కె .చౌదరి నిన్న కడప జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లెలో మృతిచెందారు. అయన వయస్సు 70 సంవత్సరాలు.ఇటీవల కాలంలో శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఉండే వారు. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా సిరిపురం గ్రామానికి చెందిన చౌదరి గారు ముప్పై ఏళ్లకిందట వంటరిగా కడప జిల్లా కు వచ్చి వనిపెంట కేంద్రంగా పరిసర గ్రామాల్లో ఆయుర్వేద, ఆర్.ఎం.పీ వైద్యునిగా ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈప్రాంత గ్రామీణులతో […]పూర్తి వివరాలు ...

చరిత్ర ప్రత్యేక వార్తలు

చీకటి మాటున గంజికుంట సీమ చరిత్ర

ఐదు వందల ఏళ్లకు పైగా ఆధ్యాత్మికంగా , రాజకీయంగా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన గంజికుంట నేడు పట్టించుకునేవారు కరువై క్రమక్రమంగా చీకటి పుటల్లోకి నెట్టివేయబడుతోంది. విజయనగర సామ్రాజ్య కాలంలో వనిపెంట , మైదుకూరు, దువ్వూరు ప్రాంతాలకు రాజకీయ కేంద్రంగా విలసిల్లిన గంజికుంట సీమ చరిత్రకు శ్రీకృష్ణ దేవరాయల, అచ్యుతదేవరాయల కాలంనాటి శిలాశాసనాలు(16వ శతాబ్దం ) ఆధారాలుగా నిలుస్తున్నాయి. బ్రిటీషువారి రికార్డులకు ఎక్కిన పాలెగాళ్ళు పట్రా విటలపతినాయుడు వెలమ వెంకోజీ నాయుడు , వన్నూరమ్మలు రాజకీయ కార్యకలాపాలకు గంజికుంట […]పూర్తి వివరాలు ...

పర్యాటకం

కడప జిల్లా పర్యాటక ఆకర్షణలు

కడప జిల్లాలోని వివిధ పర్యాటక ఆకర్షణలు : కోటలు: గండికోట (విశేషం : కొండకు పెన్నానది గండికొట్టిన చోట నిర్మించిన కోట. ఇక్కడ ఏర్పడిన లోయకు The Grand Canyon of India అనిపేరు), సిద్ధవటంకోట (విశేషం : మట్లిరాజుల స్థావరం, కడప జిల్లా తొలి పాలనాకేంద్రం). విహారప్రాంతాలు: గుంజన జలపాతం, గుండాలకోన, తుమ్మలబైలు, సోమశిల వెనుక జలాలు, గండికోటలోని పెన్నాలోయ, మైలవరం జలాశయం, బ్రహ్మంసాగర్ జలాశయం, ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట, రైల్వేకోడూరులోని ఎర్రచందనం పార్కు, ఇడుపులపాయలోని ఎకోపార్కు, నెమళ్ళ పార్కు, కడప నగరంలోని శిల్పారామం, రాజీవ్ స్మృతివనం. పుణ్యక్షేత్రాలు: అద్వైత: పుష్పగిరి దేవాలయాలు (విశేషం: […]పూర్తి వివరాలు ...

వార్తలు

చిరుతపులిని తగులబెట్టిన రైతు

మైదుకూరు: మండలంలోని మిట్టమానుపల్లెకు చెందిన రైతు మూలే రామసుబ్బారెడ్డి తన పంటపొలాలను అడవి జంతువుల నుంచి రక్షించుకొనే నేపధ్యంలో తన తోటకు విద్యుత్ వైర్లతో కంచె వేశాడని, రాత్రివేళ చిరుత వచ్చి విద్యుత్ తీగలకు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందిందని, చిరుత మృతిచెందడంతో రైతు రామసుబ్బారెడ్డి శక్రవారం స్టార్టర్ ఆయిల్ చిరుతపై పోసి నిప్పుపెట్టి ఆనవాలు లేకుండా కాల్చివేయాలనే ప్రయత్నం చేశాడని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపధ్యంలో దర్యాప్తు చేసి శనివారం నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు […]పూర్తి వివరాలు ...

చరిత్ర ప్రసిద్ధులు

పాలెగత్తె హొన్నూరమ్మ

మట్లి వెంకట్రామరాజు మైసూరు నవాబైన హైదరాలీకి కప్పము కట్టడానికి తిరస్కరించాడు. దీంతో ఆగ్రహించిన మైసూరు నవాబు హైదరాలీ దండెత్తి వచ్చి  వెంకట్రామరాజును తరిమి సిద్దవటం కోటను స్వాధీనం చేసుకొన్నాడు. హైదరాలీ ఈ సిద్ధవటం కోటను కప్పం చెల్లించు విధానంపై చిట్వేలి జమిందారునకు స్వాధీనం చేసినాడు. ఈ జమిందారు భాకరాపేట పరిసర ప్రాంతాలలో ఉన్న పట్ర పాళెగార్ల వ్యవహారాలకు దోపిడీలకు భయపడి, ముదిరెడ్డిపల్లె పాళెగాడైన గోపాలరెడ్డి ఆయన సోదరుడు నర్సింరెడ్డికి అమ్మివేశాడు. ఈ  ముదిరెడ్డిపల్లి సోదరులు  దుర్మార్గులు. పేద […]పూర్తి వివరాలు ...

చరిత్ర

కడప ప్రాంత శాసనాలలో రాయల కాలపు చరిత్ర !

విజయనగర చరిత్రలో కడప ప్రాంతానికి కూడా విశిష్టమైన స్థానం ఉన్నట్లు ఈ ప్రాంతంలోని వివిధ చోట్ల లభించిన శాసనాల వల్ల అవగతం అవుతోంది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన గండికోట సీమ, సిద్దవటం సీమ, ములికినాటి సీమ, సకిలిసీమ ప్రాంతాలలోని దేవాలయాలూ, బురుజులూ, శాసనాలూ, కైఫీయతుల ద్వారా కడప జిల్లా చారిత్రక విశేషాలు వెలుగుచూస్తున్నాయి. సాహితీ సమరాంగణ చక్రవర్తిగా చరిత్రకెక్కిన శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ప్రస్తుత కడప ప్రాంతం రాజకీయంగా, సాంస్కృతికంగా ప్రధాన భూమికను పోషించింది. కడప ప్రాంతంలో లభించిన […]పూర్తి వివరాలు ...

error: