బమ్మెరపోతన మనుమలు కేసన, మల్లనలు. వీరు పోతనకు ముమ్మనుమలనియు తెలుస్తున్నది. వీరు జంటకవులు. విష్ణు భజనానందం, దాక్షాయణీ పరిణయం అను రెండు కావ్యాలు రచించారు. దాక్షాయణీ పరిణయంలోని ‘సుకవి స్తుతి’లో తమ తాత పోతరాజును, ఇతర కవులను ప్రశంసించారు. ఆ గ్రంథం అముద్రితం. వావిళ్ల వారి శ్రీమదాంధ్ర భాగవత ముద్రణలోని శేషాద్రి రమణ కవుల ‘భాగవత ప్రశంస’ నుండి ఆ ప్రశంసా పద్యాన్ని ఎత్తి చూపుతున్నాను. ఆ పద్యమిది.
చ|| నెఱిగుఱిగల్గు నన్నయమనీషిని దిక్కన శంభుదాసునిన్
బరువడి మత్పితామహుని బమ్మెరపోతన భాస్కరాహ్వయున్
వరకవి సార్వభౌముని నవారితభక్తి నుతింతు నెప్పుడున్
గురుకరుణాఢ్యు లంధ్రకవి కుంజరులం దగ భూతి శోభిలన్.
వారీ పద్యంలో నన్నయను తిక్కనను శంభుదాసుని పోతనను భాస్కరుని స్తుతించినట్లు మాత్రమే ఊహించే అవకాశముంది. తరువాతి ‘వరకవి సార్వభౌముని’ భాస్కరునికి Read the rest of this entry »
Popularity: 52% [?]
